Sai pallavi:ఏంటి.. సాయి ప‌ల్ల‌వి వ‌ల‌న ర‌ణ్‌బీర్ క‌పూర్- అలియా భ‌ట్ విడాకులు తీసుకోబోతున్నారా..!

Sai pallavi: లేడి సూప‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాల న‌టిగా 2005లో 'కస్తూరి మాన్' అనే మలయాళ సినిమా చేసిన ఈ భామ , 2008లో 'ధామ్ ధూమ్' అనే తమిళ సినిమా చేసింది. అనంత‌రం విజయ్ టీవీలో 2008లో వచ్చిన 'ఉంగలిల్ యార్ ఆడుతా ప్రభుదేవా' డ్యాన్స్ రియా

  • Publish Date - April 14, 2024 / 06:17 PM IST

Sai pallavi: లేడి సూప‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాల న‌టిగా 2005లో ‘కస్తూరి మాన్’ అనే మలయాళ సినిమా చేసిన ఈ భామ , 2008లో ‘ధామ్ ధూమ్’ అనే తమిళ సినిమా చేసింది. అనంత‌రం విజయ్ టీవీలో 2008లో వచ్చిన ‘ఉంగలిల్ యార్ ఆడుతా ప్రభుదేవా’ డ్యాన్స్ రియాలీటీ షోలో పాల్గొంది. ఇక ఆ త‌ర్వాత సంవత్సరం తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 4’లో పార్టిసిపేట్ చేసి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించింది. సాయి ప‌ల్ల‌వి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. తెలుగులో న‌టించిన తొలి సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో ఆమెకి అవ‌కాశాలు వెల్లువెత్తాయి. ‘పడి పడి లేచే మనసు’, ‘ఎంసీఏ’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్స‌, ‘విరాటపర్వంస ఇలా వరుస అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి.

సాయి ప‌ల్ల‌వి త‌న‌దైన న‌ట‌న‌తో పాటు డ్యాన్స్‌తోను ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో మెప్పించింది. ఇక ఈ భామ స్కిన్ షో చేయదు… రొమాంటిక్ సీన్స్ లో నటించదు,మరీ పొట్టి బట్టలు వేసుకోదు అయిన‌ప్ప‌టికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకుంది. అయితే సాయి ప‌ల్ల‌వికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఆమెతో ఏ హీరో అయిన సినిమా చేస్తే అత‌ను త‌న భార్య‌కి విడాకులు ఇవ్వ‌డం ప‌క్కా అంటూ కొంద‌రు చెప్పుకొస్తున్నారు. లవ్ స్టోరీ సినిమాలో నాగ చైత‌న్య‌తో సాయి ప‌ల్ల‌వి న‌టించింది. ఆ సినిమా రిలీజ్ త‌రువాత నాగచైతన్య-సమంతకు విడాకులు తీసుకున్నారు. ఇక తమిళ స్టార్ హీరో ధనుష్ తోమారి 2 సినిమా చేసింది సాయి ప‌ల్ల‌వి. దీంతో ధనుష్ తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చేశాడు.

ఇక సాయి పల్లవి ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ఓ సినిమా చేస్తోంది. విడాకులు ఫార్ములా వర్కౌట్ అయితే రణ్‌బీర్ కపూర్‌ -అలియా జంట కూడా విడాకులు తీసుకోవ‌డం ఖాయం అని జ‌నాలు జోస్యాలు చెబుతున్నారు. కొంద‌రు ఇదంతా చెత్త లాజిక్ అంటూ కొట్టి పాడేస్తున్నారు. కాగా, సాయి ప‌ల్లవి బాలీవుడ్‌లో రామాయణం ఆధారంగా రూపొందుతున్న సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో రాముడుగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పాత్రను పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా కేజీఎఫ్ హీరో మారడం విశేషంగా చెప్పుకోవాలి. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ మొద‌లు కానుంది.

రామాయణం సినిమాలో సీత పాత్రను పోపిష్తున్న సాయి పల్లవికి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు 10 కోట్లకు మించి రెమ్యునరేషన్ అందుకొన్న హీరోయిన్లు అరుదుగా కనిపిస్తారు. కానీ ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పారితోషికం అందుకోబోతున్నది.ఈ సినిమాలో నటించినందుకు గాను 50 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే విషయం కరెక్ట్ అయితే.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం అందుకొన్న హీరోయిన్‌గా సాయిపల్లవి పేరు మార్మోగిపోతుంది.

Latest News