ఎన్నికలకి కొద్ది రోజుల ముందు చేతిపై టాటూ వేయించుకున్న రేణూ దేశాయ్..పవన్కి మద్దతిచ్చినట్టేనా?
Renu Desai| ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఎన్నికల హంగామా కనిపిస్తుంది. ఏపీలో అయితే ఈ సారి రాజకీయం మరింత వేడెక్కుతుంది. బీజేపీ, టీడీపీ, జన సేన కూటమి ప్రచారాలు ఒక వైపు వైఎస్ జగన్ బస్సు యాత్ర మరోవైపు సాగుతున్నాయి.ఇక ప్రచారాలలో రాళ్లదాడి కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఇదే క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ షేర్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేణూ దేశాయ్ని పలు విషయాలలో విమర్శించే జనసైనికులు ఈ సారి మాత్రం ఆమెని ఆకాశానికి ఎత్తుతున్నారు. అందుకు కారణం ఏంటంటే.. రేణు దేశాయ్ బీజేపీ సింబల్ని తన చేతిపై టాటూగా వేయించుకోని కూటమికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పకనే చెప్పింది.
రేణూ తన చేతిపై ‘మౌనం పరం శీలం’ అనే కొటేషన్ తో పాటు కమలం పువ్వుని కూడా టాటూగా వేయించుకుంది. దీనికి కొన్నిసార్లు మాటలకంటే ఇలాంటి ఫొటోలే గట్టిగా వినిపిస్తాయి రాసుకొచ్చింది. చివర్లో ఎలక్షన్ 2024 అనే హ్యాష్ టాగ్ కూడా జోడించడంతో రేణూ దేశాయ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు .గతంలో పవన్ కళ్యాణ్ గురించి కాస్త నెగెటివ్గా మాట్లాడిన రేణూ దేశాయ్ ఇటీవలి కాలంలో కాస్త పాజిటివ్గా స్పందిస్తూ ఉండడంతో మెగా ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి పవన్ని అసెంబ్లీలో చూడాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇందుకు రేణూ మద్దతు కూడా కావాలని కోరుతున్నారు.
ఇక రేణూ దేశాయ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత రేణూ దేశాయ్ పిల్లల బాగోగులు చూసుకుంటూ పూణేలో ఉంటుంది. బుల్లితెర, వెండితెరకు దూరంగా ఉంటుంది. ఆ మధ్య టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించింది. ఈ సినిమా రేణూదేశాయ్కి ఉపయోగం లేకుండా పోయింది. అయితే రేణూ దేశాయ్ తన కొడుకు అకీరాని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అందుకుగాను పలు విభాగాలలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుంది.