మహిళా సంఘాలకు సంబంధిత అధికారి అల్టిమేటం వైరల్గా మారుతున్న ఆడియో రికార్డింగ్లు విధాత బ్యూరో, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజున జరుగుతున్న తీగల వంతెన (Cable Bridge) ప్రారంభోత్సవ కార్యక్రమానికి పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ హాజరుకావాలని సంబంధిత అధికారి సభ్యులకు అల్టిమేటం జారీ చేసింది. అనారోగ్యం, ఇతర కారణాలతో ఒకరిద్దరూ రాకున్నా, ప్రతి సంఘం నుండి కనీసం 8 మంది తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందేనని […]
విధాత బ్యూరో, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజున జరుగుతున్న తీగల వంతెన (Cable Bridge) ప్రారంభోత్సవ కార్యక్రమానికి పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ హాజరుకావాలని సంబంధిత అధికారి సభ్యులకు అల్టిమేటం జారీ చేసింది.
అనారోగ్యం, ఇతర కారణాలతో ఒకరిద్దరూ రాకున్నా, ప్రతి సంఘం నుండి కనీసం 8 మంది తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందేనని సదరు సంఘాల గ్రూప్ లీడర్లకు దిశా నిర్దేశం చేసింది.
తీగల వంతెన ప్రారంభానికి హాజరుకాని మహిళా స్వయం సహాయ బృందాల్లోని సభ్యులకు వంద రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలకు లోబడి ఆయా సంఘాల గ్రూప్ లీడర్లు తమ సభ్యులకు వాట్సప్ వేదికగా పంపిన ఆడియో రికార్డులు
వైరల్గా మారాయి.
తీగల వంతెన ప్రారంభానికి తీసుకువెళ్లేందుకుగాను, ఇంటి ముందుకే బస్సు వస్తుంది. సభ్యులను తీసుకువెళ్లడం, తిరిగి తీసుకురావడం జరుగుతుంది. మేడం ఆదేశాలు పాటించని సభ్యులకు ఆమె సూచించిన మేరకు వంద రూపాయల ఫైన్ వేయడం జరుగుతుంది.
అలాగే వారి వివరాలు అందించడం జరుగుతుంది.. అంటూ గ్రూప్ లీడర్లు పెట్టిన ఆడియో రికార్డులు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు బలవంతంగా మహిళ స్వయం సహాయక బృందాలను తరలించడం, ఈ కార్యక్రమాలకు రాకపోతే పెన్షన్లు కట్ చేస్తామని హెచ్చరించడం గతంలోనూ జరిగింది.