Snake Bite | ఆధునిక సమాజంలోనూ మంత్ర, తంత్రాలపై ప్రజలకు నమ్మకం తగ్గట్లేదు. అనారోగ్యం బారిన పడ్డా, విష సర్పాలు కాటేసినా.. ఆస్పత్రికి వెళ్లకుండా మంత్రగాళ్లను సంప్రదిస్తున్నారు. దీంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పాము కాటుకు బలైన పాపను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, భూతవైద్యం ద్వారా కాపాడేందుకు ప్రయత్నించారు. చివరకు పాప చనిపోయింది. కానీ చిన్నారి బతికే ఉందంటూ భూతవైద్యుడు నమ్మబలికి, ఆమెపై ఆవు పేడ కప్పి.. పూజలు చేయడం ప్రారంభించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ […]
Snake Bite |
ఆధునిక సమాజంలోనూ మంత్ర, తంత్రాలపై ప్రజలకు నమ్మకం తగ్గట్లేదు. అనారోగ్యం బారిన పడ్డా, విష సర్పాలు కాటేసినా.. ఆస్పత్రికి వెళ్లకుండా మంత్రగాళ్లను సంప్రదిస్తున్నారు. దీంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
పాము కాటుకు బలైన పాపను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, భూతవైద్యం ద్వారా కాపాడేందుకు ప్రయత్నించారు. చివరకు పాప చనిపోయింది. కానీ చిన్నారి బతికే ఉందంటూ భూతవైద్యుడు నమ్మబలికి, ఆమెపై ఆవు పేడ కప్పి.. పూజలు చేయడం ప్రారంభించాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లా థానాకాంట్ సమీప గ్రామంలో మంగళ్ సింగ్ అనే వ్యక్తి భార్యా, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం రాత్రి తన గుడిసెలో నిద్రిస్తున్న ఆరేళ్ల కుమార్తెను పాము కాటేసింది.
పాప గట్టిగా అరవడంతో అప్రమత్తమైన మంగళ్ సింగ్.. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. చిన్నారి పరిస్థితి విషమించడంతో చివరకు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా, పాప బతికే ఉందని భూత వైద్యుడు నమ్మబలికాడు.
ఆమె శరీరంపై ఆవు పేడ కప్పి, చుట్టూ వేప కొమ్మలు పెట్టాలని అతను సూచించాడు. ఈ పూజల సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని, మంగళ్ సింగ్ కుటుంబానికి నచ్చజెప్పారు. అనంతరం పాప అంత్యక్రియలు నిర్వహించారు.