Andhra Pradesh | పెళ్లైన 20 ఏండ్ల‌కు సంతానం.. ఒకేసారి ముగ్గురికి జ‌న్మ‌నిచ్చి త‌ల్లి మృతి

Andhra Pradesh | పెళ్లైన ప్ర‌తి జంట తాము త‌ల్లిదండ్రులం కావాల‌ని కోరుకుంటారు. ఈ క్ర‌మంలో చాలా మందికి నెల‌ల్లోనే పిల్ల‌లు పుడుతారు. కానీ కొంద‌రికి సంవ‌త్స‌రాలు గ‌డిచినా సంతానం క‌ల‌గ‌రు. అలాంటి మ‌హిళ‌లు మాతృత్వం కోసం ఆరాట‌ప‌డుతుంటారు. ఏదో ఒక రోజున పిల్ల‌లు పుడితే ఆ సంతోషానికి అవ‌ధులు లేకుండా పోతోంది. ఓ మ‌హిళ‌కు కూడా పెళ్లైన 20 ఏండ్ల‌కు సంతానం క‌లిగింది. ఒకే కాన్పులో ముగ్గురి పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చి, ఆమె అనంత‌లోకాల‌కు వెళ్లిపోయింది. ఈ […]

  • Publish Date - August 10, 2023 / 02:25 AM IST

Andhra Pradesh | పెళ్లైన ప్ర‌తి జంట తాము త‌ల్లిదండ్రులం కావాల‌ని కోరుకుంటారు. ఈ క్ర‌మంలో చాలా మందికి నెల‌ల్లోనే పిల్ల‌లు పుడుతారు. కానీ కొంద‌రికి సంవ‌త్స‌రాలు గ‌డిచినా సంతానం క‌ల‌గ‌రు. అలాంటి మ‌హిళ‌లు మాతృత్వం కోసం ఆరాట‌ప‌డుతుంటారు.

ఏదో ఒక రోజున పిల్ల‌లు పుడితే ఆ సంతోషానికి అవ‌ధులు లేకుండా పోతోంది. ఓ మ‌హిళ‌కు కూడా పెళ్లైన 20 ఏండ్ల‌కు సంతానం క‌లిగింది. ఒకే కాన్పులో ముగ్గురి పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చి, ఆమె అనంత‌లోకాల‌కు వెళ్లిపోయింది. ఈ విషాద ఘ‌ట‌న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో చోటు చేసుకుంది.

నందిగామ మండ‌లం మాగ‌ల్లు గ్రామానికి చెందిన షేక్ న‌జీరా(35)కు ప‌ల్ల‌గిరికి చెందిన ఖాసింతో 20 ఏండ్ల క్రితం పెళ్లి అయింది. ఖాసిం వృత్తిరీత్యా ఆటో న‌డుపుతూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. అయితే ఈ దంప‌తుల‌కు పిల్ల‌లు క‌ల‌గ‌లేదు. సంతానం కోసం చేయ‌ని పూజ లేదు.. మొక్క‌ని దేవుడు లేడు.

ఎన్నో ప్రార్థ‌న‌లు చేశారు. చివ‌ర‌కు 20 ఏండ్ల తర్వాత న‌జీనా గ‌ర్భం దాల్చింది. దీంతో కుటుంబ స‌భ్యులంతా ఆనంద భ‌రితుల‌య్యారు. ప‌ది రోజుల క్రితం ఆమెకు నెల‌లు నిండ‌టంతో పురిటినొప్పులు వ‌చ్చాయి. ఇక విజ‌య‌వాడ‌లోని ఓ ప్ర‌యివేటుకు న‌జీరాను కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు.

న‌జీరాకు వైద్యులు సీజేరియ‌న్ నిర్వ‌హించి, ముగ్గురు పిల్ల‌ల‌కు పురుడు పోశారు. వీరిలో ఇద్ద‌రు ఆడ పిల్ల‌లు కాగా, ఒక‌రు బాబు ఉన్నారు. న‌జీరాకు ర‌క్తం త‌క్కువ‌గా ఉండ‌టంతో ఆమెకు ర‌క్తం ఎక్కించారు. ఈ క్ర‌మంలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ న‌జీరా మంగ‌ళ‌వారం రాత్రి క‌న్నుమూసింది. బుధ‌వారం ఆమె అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

ఐసీయూలో పిల్ల‌లు.. భ‌ర్త ఆర్త‌నాదాలు

న‌జీరా ముగ్గురు పిల్ల‌లు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మాతృమూర్తి బిడ్డ‌ల‌తో ముద్దుమురిపెం తీర్చుకోకుండా అనంత‌లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో.. ఖాసీం తీవ్ర ఆవేద‌న‌కు గుర‌వుతున్నాడు. భ‌ర్త ఆర్త‌నాదాల‌తో విషాదం ఏర్ప‌డింది. భార్య‌ను ద‌క్కించుకోలేక‌పోయాన‌ని ఆవేద‌న చెందుతూ, పిల్ల‌ల‌ను ఎలా కాపాడుకోవాలో అని ఖాసీం త‌ల్ల‌డిల్లుతున్నాడు.

Latest News