ఢిల్లీ లిక్కర్ స్కాం.. మరొకరు అరెస్ట్

విధాత‌, ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ ల పర్వం కొన‌సాగుతుంది. ఈ కేసులో మంగ‌ళ‌వారం రోజు తొలి అరెస్ట్ నమోదైన సంగతి తెలిసిందే. స్కాంలో మరొకరు అరెస్టయ్యారు. వ్యాపారి సమీర్ మహింద్రును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. విజయ్ నాయర్, సమీర్ మహింద్రు మధ్య లావాదేవీలు నడిచినట్లు అధికారులు గుర్తించారు. […]

ఢిల్లీ లిక్కర్ స్కాం.. మరొకరు అరెస్ట్

విధాత‌, ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ ల పర్వం కొన‌సాగుతుంది. ఈ కేసులో మంగ‌ళ‌వారం రోజు తొలి అరెస్ట్ నమోదైన సంగతి తెలిసిందే. స్కాంలో మరొకరు అరెస్టయ్యారు. వ్యాపారి సమీర్ మహింద్రును ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. విజయ్ నాయర్, సమీర్ మహింద్రు మధ్య లావాదేవీలు నడిచినట్లు అధికారులు గుర్తించారు. మహింద్రు నుంచి విజయ్ నాయర్ ద్వారా.. మనీష్ సిసోడియా సన్నిహితుడు అర్జున్ పాండేకు 4 కోట్లు ముట్టినట్లు సీబీఐ ఆరోపించింది .

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవలే తొలి అరెస్టు నమోదైంది. ముంబయి కేంద్రంగా పని చేస్తున్న ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ మాజీ సీఈవో విజయ్ నాయర్ ను సీబీఐ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు విజయ్ నాయర్ సన్నిహితుడని సమాచారం.

విజయ్ నాయర్ తరపున లిక్కర్ వ్యాపారీ సమీర్… మనీశ్ సిసోడియా అనుచరుడైన అర్జున్ పాండేకు ముడుపులు అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రామచంద్రపిళ్లై సహా.. 15మంది నిందితులుగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ పై ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేస్తోంది.