Site icon vidhaatha

AP Cabinet | ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. అర్చకులకు తీపి కబురు

AP Cabinet

అమరావతి: రాష్ట్రంలో అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, నిరుపేదలకు ఇచ్చిన భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హర్షణీయమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, లంక భూములకు సంబంధించి పూర్తి హక్కులు లబ్ధిదారులకే కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సీఎం జగన్‌ అధ్యక్షతన ఇవాళ జరిగిన కీలక భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మూడున్నర గంటలపాటు సాగిన కేబినెట్‌ భేటీలో 55 అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అనైన్డ్‌ల్యాండ్‌ ఉన్న రైతులకు అనుకూలంగా కేబినెట్‌ సానుకూల నిర్ణయం తీసుకుంది. అసైన్డ్‌ ల్యాండ్‌ పొందిన లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ-విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి. మొత్తం 63,191,84 ఎకరాల అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

18న జగనన్న తోడు నిధుల జమ.

20న సీఆర్‌డీఏ, ఆర్‌5 జోన్‌లలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం.

21న నేతన్న నేస్తం నిధుల జమ.

26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ.

28న జగన్న విదేశీ విద్యా పథకం.

ఎన్నికలకు సిద్ధం అవ్వండి: మంత్రులకు సీఎం జగన్ సూచన

విధాత‌: ముందస్తు ఎన్నికలు ఉన్నాయట… జగన్ ఢిల్లీలో అదే చర్చించేందుకు వెళ్ళాడట… ఇలా సాగిన పుకార్లకు జగన్ ముగింపు పలికారు. ముందస్తు ఏమి లేదని.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని చెప్పకనే చెప్పారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో జగన్ మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంకో తొమ్మిది నెలల్లో ఎన్నికలు ఉన్నాయని, అందుకు ఇప్పటినుంచే సిద్ధం అవ్వాలని అన్నారు. అంటే రానున్న మూణ్ణాలుగు నెలలో ఎన్నికలు లేవని తేల్చేశారు. దీంతోబాటు ఎసైన్మెంట్ భూముల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది.

Exit mobile version