MLC Elections: ఏపీ-తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమే!

తెలంగాణలోని 5, ఆంధ్రప్రదేశ్‌లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న జరుగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా అదనంగా మరెవరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక ఎమ్మెల్సీలు అధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ వెల్లడించనుంది.

MLC Elections: ఏపీ-తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమే!

MLC Elections: తెలంగాణలోని 5, ఆంధ్రప్రదేశ్‌లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న జరుగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. తెలంగాణలోని ఐదు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి అద్ధంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి, మిత్రపక్షం సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు హాజరయ్యారు.

అలాగే బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు పాల్గొన్నారు. అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. రేపు నామినేషన్ ల పరిశీలన,13 న ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది.

ఈ నెల 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. 20 న ఉదయం 8 నుండి సాయం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా అదనంగా మరెవరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక ఎమ్మెల్సీలు అధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ వెల్లడించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో
ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన తరపున నాగబాబు, టీడీపీ తరపున బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్‌, కావలి గ్రీష్మ, బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులకు మద్దతుగా నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, విష్ణుకుమార్ రాజు, రఘురామకృష్ణంరాజు, పితాని సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పల్లా శ్రీనివాస్, టీడీ జనార్దన్, కురుగొండ్ల రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి తదితరులు వచ్చారు.

అలాగే అసెంబ్లీ కమిటీ హాల్లో బీజేపీ అభ్యర్థి సోమివీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు కందుల దుర్గేష్ ,సత్య కుమార్ యాదవ్, పల్లా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలోనూ మూడు పార్టీల అభ్యర్థులు మాత్రమే తమ నామినేషన్లు దాఖలు చేయడంతో ఏన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.

ఇక తెలంగాణలో ఎమ్మెల్సీలు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హసన్‌ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఇందులో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎగ్గె మల్లేశం గత ఏడాదే కాంగ్రెస్‌లో చేరారు. మీర్జా రియాజుల్‌ హాసన్‌ మజ్లిస్‌ నేత కాగా, మిగిలిన ముగ్గురు బీఆర్‌ఎస్‌ నేతలు.  అటు ఏపీలో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్‌బాబు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో తెలంగాణలో ఐదు, ఏపీలో ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.