Warangal: వల్మీడిలో శ్రీరామ నవమి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి భద్రాద్రికి మించిన వైభోగం దక్కేలాగా అభివృద్ధి పరుస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భద్రాద్రికి ఉన్నంత ప్రాశస్త్యం చరిత్ర వాల్మీడీ దేవాలయానికి ఉందని ఆయన చెప్పారు. మిగతా దేవాలయాలకు భిన్నంగా వాల్మీకి దేవాలయానికి ఎకరాల కొద్ది […]

Warangal: వల్మీడిలో శ్రీరామ నవమి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
  • ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
  • రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి భద్రాద్రికి మించిన వైభోగం దక్కేలాగా అభివృద్ధి పరుస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భద్రాద్రికి ఉన్నంత ప్రాశస్త్యం చరిత్ర వాల్మీడీ దేవాలయానికి ఉందని ఆయన చెప్పారు. మిగతా దేవాలయాలకు భిన్నంగా వాల్మీకి దేవాలయానికి ఎకరాల కొద్ది స్థలం ఉందని, ఆ స్థలాన్ని ఆసరా చేసుకుని దేవాలయాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసే అవకాశం మెండుగా ఉందని మంత్రి చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా వల్మీడి సీతారామచంద్రస్వామిల కళ్యాణ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి ఆదివారం సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాముడు నడయాడిన నేలగా, రామాయణ కర్త వాల్మీకి మహర్షి తపస్సు చేసిన గుట్టగా, వల్మిడికి చరిత్ర, గుర్తింపు, గౌరవం ఉన్నాయని మంత్రి తెలిపారు. గుట్టను విస్తృతంగా అభివృద్ధి చేస్తూ దేవాలయంలో 11 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. కళ్యాణ మండపం గుట్ట మీదకు రోడ్డు వంటి సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.

సీఎం కేసీఆర్ సైతం పాలకుర్తి, బమ్మెర, వల్మీడీ గ్రామాలను కలుపుతూ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పరచడానికి అడిగిన నిధులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేక చొరవ చూపుతూ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ మూడు దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నట్లు మంత్రి చెప్పారు. కనీవినీ ఎరగని రీతిలో వల్మీడిలో ఈసారి కళ్యాణం ఘనంగా వైభోగంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

నవమి నాటికి కళ్యాణ మంటపం, గుట్ట మీదకు పక్కా రోడ్డు సిద్ధం చేయాలని, ఏర్పాట్లు, మొబైల్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి ఎర్రబెల్లి తన వంతుగా వల్మీడి శ్రీరామ నవమి ఉత్సవాలకు రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఉత్సవాల సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, ఆర్డీవో కృష్ణవేణి, డిఆర్డిఓ రాంరెడ్డి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.