తిరువనంతపురం : ఇద్దరు యువకుల అకౌంట్లలో ఏకంగా రూ.2.44 కోట్లు పొరపాటున బ్యాంకు నుంచి జమయ్యాయి. అయితే, డబ్బునంతా యువకులు విలాసాలకు ఖర్చు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్లో జరగ్గా.. అరింబూర్కు నిధిన్, మను అనే ఇద్దరిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నిందితులు డబ్బుతో ఖరీదైన ఫోన్లు, వస్తువులను కొనుగోలు చేశారు. అందులో నుంచి కొంత మొత్తాన్ని లోన్లు కట్టేందుకు, మిగతా సొత్తును షేర్ మార్కెట్లు పెట్టుబడికి వాడుకున్నారు. ఇంకా మిగిలిన అకౌంట్లో సొత్తును 19 వేర్వేరు బ్యాంకుల్లోని 54 ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, బ్యాంక్ నుంచి డబ్బులు వేరే అకౌంట్లోకి వెళ్లాయని గుర్తించిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులకు అకౌంట్ ఉన్న బ్యాంక్ మరో బ్యాంక్లో విలీనం కావడం వల్ల.. సాంకేతిక సమస్యలతో వారి ఖాతాల్లో జమైనట్లు అధికారులు గ్తుించారు. బ్యాంకు సర్వర్లను తారుమారు చేసి, డబ్బులు స్వాహా చేశారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.