తిరువనంతపురం : ఇద్దరు యువకుల అకౌంట్లలో ఏకంగా రూ.2.44 కోట్లు పొరపాటున బ్యాంకు నుంచి జమయ్యాయి. అయితే, డబ్బునంతా యువకులు విలాసాలకు ఖర్చు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్లో జరగ్గా.. అరింబూర్కు నిధిన్, మను అనే ఇద్దరిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నిందితులు డబ్బుతో ఖరీదైన ఫోన్లు, వస్తువులను కొనుగోలు చేశారు. అందులో నుంచి కొంత మొత్తాన్ని లోన్లు కట్టేందుకు, మిగతా సొత్తును షేర్ మార్కెట్లు పెట్టుబడికి వాడుకున్నారు. ఇంకా మిగిలిన అకౌంట్లో సొత్తును 19 వేర్వేరు బ్యాంకుల్లోని 54 ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, బ్యాంక్ నుంచి డబ్బులు వేరే అకౌంట్లోకి వెళ్లాయని గుర్తించిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులకు అకౌంట్ ఉన్న బ్యాంక్ మరో బ్యాంక్లో విలీనం కావడం వల్ల.. సాంకేతిక సమస్యలతో వారి ఖాతాల్లో జమైనట్లు అధికారులు గ్తుించారు. బ్యాంకు సర్వర్లను తారుమారు చేసి, డబ్బులు స్వాహా చేశారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పొరపాటున యువకుల అకౌంట్లలో రూ.2.44కోట్లు.. సొత్తంతా జల్సాలకు ఖర్చు..!
<p>తిరువనంతపురం : ఇద్దరు యువకుల అకౌంట్లలో ఏకంగా రూ.2.44 కోట్లు పొరపాటున బ్యాంకు నుంచి జమయ్యాయి. అయితే, డబ్బునంతా యువకులు విలాసాలకు ఖర్చు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్లో జరగ్గా.. అరింబూర్కు నిధిన్, మను అనే ఇద్దరిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నిందితులు డబ్బుతో ఖరీదైన ఫోన్లు, వస్తువులను కొనుగోలు చేశారు. అందులో నుంచి కొంత మొత్తాన్ని లోన్లు కట్టేందుకు, మిగతా సొత్తును షేర్ […]</p>
Latest News

మార్షల్ ఆర్ట్స్తో సరికొత్త రికార్డ్ సృష్టించిన పవన్ కళ్యాణ్..
చీరలో వరంగల్ భామ వయ్యలు.. ఈషా రెబ్బను ఇలా చూసి తట్టుకోవడం కష్టమే!
న్యూజీలాండ్తో తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
సంయుక్త మీనన్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసుండరు భయ్యా.. ఇంకెందుకు లేటు ఒక లుక్ వేసేయండి!
తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా సమ్మక్క సారలమ్మ జాతర : భట్టి విక్రమార్క
డిజిటల్ అరెస్టు పేరిట వృద్ధ దంపతుల రూ.15 కోట్లు హాంఫట్!
క్యూబాకు ట్రంప్ బెదిరింపు.. సమయం మించిపోక ముందే డీల్ కుదుర్చుకోవాలని వార్నింగ్!
నెట్టింట మరో ‘మోనాలిసా’.. వీడియో వైరల్
చిరంజీవి.. ‘మన శంకర వరప్రసాద్’కు ఊరట
అతిపెద్ద అనాకొండా.. అమెజాన్ అడవుల్లో కనిపించిన అనా జూలియా!! పొడవు తెలిస్తే షాకే!