Accident: బైక్‌ను ఢీ కొట్టిన DCM.. ఒకరు మృతి.. మ‌రొక‌రికి తీవ్ర గాయాలు

విధాత: మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామ శివారులో బైకును వెనుక నుండి డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాటిమట్ల గ్రామ శివారులో అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన గుడిపాటి విజయ తన సోదరుడు మందుల విజయ్‌తో బైక్ పై వస్తుండగా వెనక నుండి TS 29 T 1979 నెంబర్ గల డీసీఎం ఢీకొట్టింది. దీంతో విజయ(32) అక్కడికక్కడే మృతిచెందగా, విజయ్ […]

  • Publish Date - March 16, 2023 / 02:20 PM IST

విధాత: మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామ శివారులో బైకును వెనుక నుండి డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాటిమట్ల గ్రామ శివారులో అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన గుడిపాటి విజయ తన సోదరుడు మందుల విజయ్‌తో బైక్ పై వస్తుండగా వెనక నుండి TS 29 T 1979 నెంబర్ గల డీసీఎం ఢీకొట్టింది. దీంతో విజయ(32) అక్కడికక్కడే మృతిచెందగా, విజయ్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. విజ‌య్‌ని చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వి జానకిరామ్ రెడ్డి తెలిపారు.

Latest News