Pawan Kalyan విధాత: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, అనా కొణిదెల దంపతులు విడిపోతున్నారన్న సోషల్ మీడియా వార్తలకు చెక్ పెడుతూ జనసేన ట్వీట్తో చెక్ పెట్టింది. పవన్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హైద్రాబాద్లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాధికాలలో పవన దంపతులు పాల్గొన్నారంటూ జనసేన ట్వీట్ చేస్తు పరోక్షంగా పవన్ దంపతుల విడాకుల ప్రచారానికి చెక్ పెట్టింది. శాస్త్రోక్తంగా పవన్ దంపతులిద్ధరూ పూజలు నిర్వహించారని, […]
Pawan Kalyan
విధాత: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, అనా కొణిదెల దంపతులు విడిపోతున్నారన్న సోషల్ మీడియా వార్తలకు చెక్ పెడుతూ జనసేన ట్వీట్తో చెక్ పెట్టింది.
పవన్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హైద్రాబాద్లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాధికాలలో పవన దంపతులు పాల్గొన్నారంటూ జనసేన ట్వీట్ చేస్తు పరోక్షంగా పవన్ దంపతుల విడాకుల ప్రచారానికి చెక్ పెట్టింది.
శాస్త్రోక్తంగా పవన్ దంపతులిద్ధరూ పూజలు నిర్వహించారని, కొద్ది రోజులలో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుందని ట్వీట్లో పేర్కోన్నారు.
తదుపరి వారాహి విజయ యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ త్వరలో మంగళగిరి చేరుకుంటారని ట్వీట్లో తెలిపారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు – వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా… pic.twitter.com/x3WJ5iUtQv
— JanaSena Party (@JanaSenaParty) July 5, 2023