విధాత: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేదల విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే నాణ్యమైన విద్యను అందిస్తున్న కేసీఆర్ సర్కార్.. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి సంబంధించిన మెనూను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.
దీంతో అక్టోబర్ 6వ తేదీన సీఎం కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8:45 గంటలకు ప్రారంభించనున్నారు. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందివ్వనున్నారు.
అల్పాహారం మెనూ ఇదే..
సోమవారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం – పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ
బుధవారం – ఉస్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ
గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం – పొంగల్/సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ
ప్రైమరీ స్కూల్ టైమింగ్స్..
ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ప్రైమరీ స్కూల్స్ పని చేస్తాయి.
బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ – ఉదయం 8:45 గంటల నుంచి
ప్రార్థనా సమయం – 9:35 నుంచి 9:45 వరకు
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని స్కూల్స్ టైమింగ్స్
ఉదయం 8:45 నుంచి సాయంత్రం 3:45 వరకు పని చేస్తాయి.
బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ – ఉదయం 8 గంటల నుంచి
ప్రార్థనా సమయం – 8:50 నుంచి 9 గంటల వరకు
అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ స్కూల్ టైమింగ్స్..
ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ప్రైమరీ స్కూల్స్ పని చేస్తాయి.
బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ – ఉదయం 8:45 గంటల నుంచి
ప్రార్థనా సమయం – 9:35 నుంచి 9:45 వరకు
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని స్కూల్స్ టైమింగ్స్
ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4:00 వరకు పని చేస్తాయి.
బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ – ఉదయం 8 గంటల నుంచి
ప్రార్థనా సమయం – 8:50 నుంచి 9 గంటల వరకు.