సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులు
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. సోమవారం ఉదయం అక్షయ పాత్ర పౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిశారు. నవంబర్ 14వ తేదీన కొడంగల్ లో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
విధాత: కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. సోమవారం ఉదయం అక్షయ పాత్ర పౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిశారు. నవంబర్ 14వ తేదీన కొడంగల్ లో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ భూమి పూజ కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మించనుంది. గ్రీన్ ఫీల్డ్ కిచెన్ లో వండిన భోజనాన్ని నియోజకవర్గం లోని అన్ని పాఠశాలలకు సరఫరా చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ.7 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. నాణ్యమైన భోజనం తయారు చేసి అందించేందుకు అక్షయ ఫౌండేషన్ దాదాపు రూ.25 వరకు ఖర్చు పెడుతుంది.
ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును అక్షయ పాత్ర ఫౌండేషన్ భరిస్తుంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధుల సాయంతో ఈ పథకం అమలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్ పాస్ట్ అందించే పథకం విజయవంతంగా అమలవుతుందన్నారు. 312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజు ఉదయాన్నే అల్పాహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని గ్రామాల్లో పిల్లలు, తల్లిదండ్రుల నుంచి ఈ పథకానికి మంచి స్పందన వచ్చింది. ఈ పథకం దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram