CM KCR | రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా

CM KCR విధివిధాలను రూపొందించాలని మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, హరీశ్‌రావును ఆదేశించిన CM KCR విధాత: రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తద్వారా కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన ప్రతి గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన […]

CM KCR | రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా

CM KCR

  • విధివిధాలను రూపొందించాలని మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, హరీశ్‌రావును ఆదేశించిన CM KCR

విధాత: రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తద్వారా కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన ప్రతి గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు.

ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని, రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావులను కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ఊహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదన్నారు. ఇప్పటికే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నా బాధితులకు ఆసొమ్ము అందడంలో ఆలస్యమవుతున్నదన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న, గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. దీనికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్ హరీశ్ రావు, సీఎస్‌ శాంతికుమారిలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.