Congress డ్రైవరన్నరలకు చేయూత ఇస్తున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి 2 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పన విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేండ్లు అవుతున్నప్పటికి రాష్ట్రంలో కార్మికులకు ప్రభుత్వం చేసింది ఏమి లేదని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. గురువారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మెదక్ నియోజక వర్గంలో డ్రైవరన్నలకు 2 లక్షల ప్రమాద భీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రమాద భీమా పోస్టర్ […]
Congress
విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేండ్లు అవుతున్నప్పటికి రాష్ట్రంలో కార్మికులకు ప్రభుత్వం చేసింది ఏమి లేదని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. గురువారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మెదక్ నియోజక వర్గంలో డ్రైవరన్నలకు 2 లక్షల ప్రమాద భీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం ప్రమాద భీమా పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ నియోజక వర్గంలో పేదలకు, నిరుపేదలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు గుర్తుచేశారు.
అదే విధంగా డ్రైవరన్నలకు తక్కువ వేతనంతో ఎక్కడో కూటికోసం పనిచేస్తుంటారని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకొని రూ.2 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో పీసీసీ నాయకులు మామిల్ల ఆంజనేయులు, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, గూడూరి ఆంజనేయులు, శంరెడ్డి, నాగులు, శంసుందర్,లాలూ, చందు గౌడ్, ఇస్మాయిల్, మహేందర్ రెడ్డి,అమీర్, రామారావు, తర్య, నాయిమ్, మహేష్, అదిల్, ముజాంబిల్, ప్రభాకర్, దాస్, పరమేష్, ముజాహిద్, ఇతరులు పాల్గొన్నారు.