Mancherial | విద్యుత్ షాక్‌తో భార్యాభర్తలు మృతి (Video)

Mancherial మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని లైన్ గడ్డ ప్రాంతంలో విషాదం భార్యను కాపాడబోయి భర్త కూడా మృతి చెందాడు విధాత, ఉమ్మడి అదిలాబాద్ ప్రతినిధి: వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంటను విద్యుత్తు షాక్ రూపంలో మృత్యువు కబలించిన తీరు స్థానికంగా విషాదాన్ని నింపింది. విద్యుత్ షాక్ (Current Shock)తో చనిపోయిన దంపతులిద్దరి విషయం తెలిసిన ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. మంచిర్యాల(Mancherial) జిల్లా చెన్నూరు పట్టణం విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ కారణంగా […]

Mancherial | విద్యుత్ షాక్‌తో భార్యాభర్తలు మృతి (Video)

Mancherial

  • మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని లైన్ గడ్డ ప్రాంతంలో విషాదం
  • భార్యను కాపాడబోయి భర్త కూడా మృతి చెందాడు

విధాత, ఉమ్మడి అదిలాబాద్ ప్రతినిధి: వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంటను విద్యుత్తు షాక్ రూపంలో మృత్యువు కబలించిన తీరు స్థానికంగా విషాదాన్ని నింపింది. విద్యుత్ షాక్ (Current Shock)తో చనిపోయిన దంపతులిద్దరి విషయం తెలిసిన ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.

మంచిర్యాల(Mancherial) జిల్లా చెన్నూరు పట్టణం విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ కారణంగా దంపతులు మృత్యువాత పడడంతో చెన్నూరు పట్టణ స్వర్ణ కారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే… చెన్నూరు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు బొల్లంపల్లి శ్రీనివాస్ (45), అతని భార్య లత (38)లు షాట్ సర్క్యూట్ కారణంగా మృత్యువాత పడ్డారు. నిన్న అర్థరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇంటి ఆవరణలో పేరుకపోయిన ధుమ్ము ధూళిని శుభ్రం చేసేందుకు లత శుక్రవారం ఉదయం కరెంటు మోటారు వేసి నీటితో దుమ్ము ధూళి పట్టిన వస్తువులను కడుగుతున్నారు. ఈ క్రమంలో షాట్ సర్క్యూట్ అయి విద్యుత్ ఘాతానికి గురైన లత అరవడంతో ఇంట్లో ఉన్న శ్రీనివాస్ తన భార్యను కాపాడాలన్న ఆతృతలో ఆమెను పట్టుకోవడంతో ఇద్దరు కూడా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే చనిపోయారు.

తండ్రి అంతులేని ఆవేదన..

తాళి కట్టిన ఆలి తనువు చాలించగా సంతానం తనను చూసుకుంటారనుకున్న అతని ధీమాను విధి వెక్కిరించింది. శ్రీనివాస్ తండ్రి లక్ష్మీ నారాయణకు ఇద్దరు కొడుకులు ఐదేళ్ల క్రితం పెద్ద కొడుకు కూడా కానరాని లోకానికి చేరుకోగా ఏడు పదుల వయసుకు చేరిన ఆ తండ్రికి చిన్న కొడుకు శ్రీనివాసు దంపతుల్లో తన వారిని చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు.

ఓ వైపున భార్యను కోల్పోయి మరో వైపును పెద్దోడు చనిపోయిన బాధను దిగ మింగుకుంటూ కాలం వెల్లదీస్తున్న ఆ వృద్ధుడిపై మరో పిడుగు పడినట్టయింది. శుక్రవారం చిన్న కొడకు, కోడలు కూడా విగత జీవులుగా మారిపోవడాన్ని చూస్తూ ఆయన రోధిస్తున్న తీరు అందరిని కండతడి పెట్టిస్తోంది. కరెంటు చిన్న కొడుకు, కోడల్ని ఆయనకు దూరం చేసిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.

మృతులు శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకులను చూస్తూ వారు ఉన్నత చదువుల వైపు సాగుతున్న తీరుతో మురిసిపోతున్న క్రమంలో ఇద్దరు బిడ్డలకు తల్లి దండ్రులను దూరమైన ఘటన స్థానికులను కలిచివేస్తోంది. శ్రీనివాస్ పెద్ద కొడుకు డిగ్రీ చేస్తుండగా, చిన్న కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కరెంట్ షాక్ తో మృతి చెందడంతో ఇద్దరి పిల్లలు అనాథలుగా మారారు చెన్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.