BJP | Medak | అమిత్ షా ఆదేశాలతో అసెంబ్లీ ముఖ్య నాయకులు పోటీ చేసే స్థానాలకు ముందే అభ్యర్థుల ప్రకటన దుబ్బాక నుండే..రఘునందన్ రావు ఆందోల్ బరిలో మాజీ మంత్రి బాబూమోహన్ మెదక్ అసెంబ్లీ బరిలో విజయ శాంతి… పటాన్ చెరువు నియోజక వర్గంలో నందీశ్వర్ గౌడ్ దాదాపుగా బీజేపీ అభ్యర్థుల ఖరారు..? ఉమ్మడి 10 అసెంబ్లీ స్థానాలపై బీజేపీ ఫోకస్ విధాత, మెదక్ ప్రతేక ప్రతినిధి: బీజేపీ ఢిల్లీ పెద్దల (వార్ రూమ్) నిర్ణయం […]
BJP | Medak |
విధాత, మెదక్ ప్రతేక ప్రతినిధి: బీజేపీ ఢిల్లీ పెద్దల (వార్ రూమ్) నిర్ణయం మేరకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని, పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం ఈటలనేనని ప్రకటించి బరిలోకి దించేందుకు బీజేపీ కేంద్ర అధిష్టాన వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ కు గజ్వేల్ ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి.
ఇక్కడే వ్యాపార పరంగా, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయని పార్టీ గ్రహించి ఈటల రాజేందర్ నే గజ్వేల్ బరిలో దించాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. దీంతో సీఎం కేసీఆర్ బరి లో ఉన్నా లేకున్నా గజ్వేల్ నుండే ఈటెల రాజేందర్ పోటీ చేస్తారని బీజేపీ పార్టీ దాదాపు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దుబ్బాక బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు బరిలో నిలువనున్నారు.
మెదక్ అసెంబ్లీ బరిలో విజయశాంతి
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించి మెదక్ ఎంపీగా బిఆరెస్ పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించిన సీని నటి విజయశాంతి సీఎం కేసీఆర్ తో పొసగక పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరింది. 20014 మెదక్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆరెస్ పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నీ వీడి బీజేపీ లో చేరారు. ప్రస్తుతం మెదక్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని బీజేపీ అధిష్టాన వర్గం దాదాపు నిర్ణయించింది.
ఇప్పటికే ఇక్కడ బీజేపీ నుచి పోటీ చేసేందుకు 5 గురు అభ్యర్థులు రెడీగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావ జాలంతో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి బీజేపీ మెదక్ అభ్యర్థిగా పోటీ చేయాలని కలలు కన్న నందు జనార్దన్ రెడ్డి ఆశలు గల్లంతు కానున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షునీ గా ఉన్న గడ్డం శ్రీనివాస్, రెండు దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న రాంచరణ్ యాదవ్, నందా రెడ్డి, న్యాయవాది రాజశేఖర్ ల టికెట్ ఆశలు అడియాశలు కానున్నాయి.
అందొల్ బరిలో మాజీ మంత్రి బాబూమోహన్
అందోల్ నియోజక వర్గం నుండి మాజీ మంత్రి బాబూమోహన్ పోటీ దాదాపు ఖరారైంది.ఇదే నియోజక వర్గం నుండి గతంలో పోటీ చేసి గెలుపొంది చంద్రబాబు మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన బాబు మోహన్ నే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గా పోటీ చేయనున్నారని సమాచారం. ఈ మేరకు బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అదే విధంగా పటాన్ చెరువు నియోజక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ను పోటీ చేయించాలని బీజేపీ అధిష్టాన వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పార్టీ వర్గాల కథనం. సిద్దిపేట నుంచి నరోత్తం రెడ్డి, నర్సాపూర్ నుంచి మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ లను పోటీ చేయించాలని బీజేపీ అధిష్టాన వర్గం భావిస్తుందని సమాచారం.
జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాలలో బీజేపీ నుండి పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది. ఇతర నియోజకవర్గాల పై కూడా బీజేపీ అధిష్టాన వర్గం ఫోకస్ పెట్టింది. అంతే కాకుండా అన్ని నియోజక వర్గాలలో ఇతర రాష్ర్టాల బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పటి నుండే నియోజక వర్గాలలో పాగా వేయనున్నారు. జిల్లాలో రాజకీయ సమీకరణలు మారితే ఆయా నియోజక వర్గాలలో అభ్యర్థులు మారవచ్చని తెలుస్తుంది.