తాను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీని వీడి ఏ పార్టీలో చేరడం లేదని తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వరంగల్ ఎంపీ అభ్యర్థి బాబు మోహన్ స్పష్టం చేశారు
వరంగల్ ఎంపీగా బరిలో నిలుస్తాను
ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబు మోహన్
విధాత, వరంగల్ ప్రతినిధి: తాను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీని వీడి ఏ పార్టీలో చేరడం లేదని తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వరంగల్ ఎంపీ అభ్యర్థి బాబు మోహన్ స్పష్టం చేశారు. వరంగల్ లో బాబు మోహన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. నేను పార్టీలో చేరిన రోజే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారని చెప్పారు.
ప్రస్తుతం తాను తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నానని వివరించారు. నేను పుట్టింది, పెరిగింది నా బాల్యమంతా వరంగల్లోనే తనకు ఈ జిల్లాతో మంచి అనుబంధం ఉందన్నారు నేను ప్రజాశాంతి పార్టీలోనే ఉన్నాను. ప్రజా ప్రశాంతి పార్టీ లోనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వదంతులు పుట్టించకూడదని విన్నవించారు. తన రాజకీయ ప్రయాణం పై చీప్ పాలిటిక్స్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
వరంగల్ ప్రజలకు సేవలు అందించేందుకు మీ ముందుకు వస్తున్నానని చెప్పారు. 25 సంవత్సరాలుగా పాలిటిక్స్ లో ఉన్నాను ఏక్కడ అబద్ధం ఆడలేదన్నారు. బిజెపికి వెట్టి చాకిరి చేశాను, ఎంతోమందికి సభలు నిర్వహించానని తెలిపారు. నాకు ఫెయిర్ బాబు మోహన్ అనే పేరు ఉందన్నారు. పేద విద్యార్థులకు ఉచిత హాస్టల్లు, విద్య కేఏ పాల్ అందిస్తున్నారని అందుకే ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు బాబు మోహన్ వివరించారు.