Site icon vidhaatha

Yadagirigutta: యాదాద్రిలో భక్తజనం రద్దీ.. ఘనంగా ఏకాదశి లక్ష పుష్పార్చన

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావ‌డంతో ఎండలు సైతం లెక్కచేయకుండా అధిక సంఖ్య‌లో తరలివచ్చిన భక్తుల రద్దీతో కొండ పరిసరాలు, క్యూలైన్లు కిక్కిరిసాయి.

గర్భాలయంలో స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామికి నిత్యారాధనలు, అభిషేకాలు, అర్చనలు, సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవాన్ని భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చక బృందం స్వామివారికి లక్ష పుష్పార్చన ఘ‌నంగా నిర్వహించారు. మంగళహారతి అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.

Exit mobile version