• Telugu News
  • /Latest

AICC శాశ్వత సభ్యునిగా.. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ

AICC మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి హర్షం విధాత :మెదక్ ప్రత్యేక ప్రతినిధి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శాశ్వత సభ్యునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా పనిచేసిన మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అందోల్ మాజీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎంపికయ్యారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర్ రాజనర్సింహ ను ఏఐసీసీ లో ఆత్యున్నత పదవి దక్కింది.ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.మెదక్ […]

Reported by: krs | latest | IST
Read Time: 2 mins
AICC శాశ్వత సభ్యునిగా.. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ

AICC

మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి హర్షం

విధాత :మెదక్ ప్రత్యేక ప్రతినిధి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శాశ్వత సభ్యునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా పనిచేసిన మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అందోల్ మాజీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎంపికయ్యారు.

ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర్ రాజనర్సింహ ను ఏఐసీసీ లో ఆత్యున్నత పదవి దక్కింది.ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లలోల్ల శశిధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.