విధాత, హైదరాబాద్ : సీనీయర్ కాంగ్రెస్నేత, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో ఆయన బీజేపీ టికెట్ హామీతో సర్వే బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం సాగుతుంది. బీజేపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని సర్వే అనుచరుల కథనం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరుగనుంది.
పార్లమెంటు ఎన్నికలతో పాటే మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే బీఆరెస్ అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదితను ఎంపిక చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన శ్రీ గణేశ్ను ఎంపిక చేశారు. 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన గణేశ్ రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఉప ఎన్నికలకు వచ్చేసరికి గణేశ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో బీజేపీ బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నించి సర్వే సత్యనారాయణ వైపు మొగ్గు చూపింది.