దైవ ద‌ర్శ‌నానికి వెళ్తుండ‌గా రోడ్డుప్ర‌మాదం.. న‌లుగురు మృతి

దైవ ద‌ర్శ‌నానికి ఓ కుటుంబం వెళ్తుండ‌గా, వారు ప్ర‌యాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది.

  • Publish Date - December 22, 2023 / 03:20 AM IST

హ‌నుమ‌కొండ : ఓ కుటుంబం దైవ ద‌ర్శ‌నానికి వెళ్తుండ‌గా, వారు ప్ర‌యాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ రోడ్డుప్ర‌మాదం హ‌నుమ‌కొండ జిల్లాలోని ఎల్క‌తుర్తి మండ‌లం పెంచిక‌ల‌పేట వ‌ద్ద చోటు చేసుకుంది.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతుల‌ను ఏటూరు నాగారానికి చెందిన కాంత‌య్య‌, భ‌ర‌త్, శంక‌ర్, చంద‌న‌గా పోలీసులు గుర్తించారు. గాయ‌ప‌డ్డ మ‌రో ముగ్గురిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే కారును లారీ ఢీకొట్ట‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Latest News