Gautham Gambhir | టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చాలా ఆవేశపరుడన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం ఆలోచించకుండా గంభీర్ నోరు జారేస్తుంటాడు. ఇప్పటికే ఆయన చాలా మంది ప్లేయర్స్తో గొడవలు పడడం మనం చూశాం. ప్రస్తుతం ఆసియా కప్ 2023 టోర్నీకి కామెంటేటర్గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్.. పల్లెకెలెలో పాకిస్తాన్, టీమిండియా మధ్య మ్యాచ్ సమయంలో ప్రేక్షకులకి మధ్య వేలు చూపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పిచ్ రిపోర్ట్ తర్వాత మీడియా రూమ్కి […]
Gautham Gambhir |
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చాలా ఆవేశపరుడన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం ఆలోచించకుండా గంభీర్ నోరు జారేస్తుంటాడు. ఇప్పటికే ఆయన చాలా మంది ప్లేయర్స్తో గొడవలు పడడం మనం చూశాం. ప్రస్తుతం ఆసియా కప్ 2023 టోర్నీకి కామెంటేటర్గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్.. పల్లెకెలెలో పాకిస్తాన్, టీమిండియా మధ్య మ్యాచ్ సమయంలో ప్రేక్షకులకి మధ్య వేలు చూపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
పిచ్ రిపోర్ట్ తర్వాత మీడియా రూమ్కి వెళుతున్నప్పుడు గంభీర్ని చూసి కొందరు ఏదో అరవడం మొదలు పెట్టారు. దాంతో గంభీర్ తన వేలు అలా చూపించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
అయితే ఈ వీడియోని ఒక పాకిస్తాన్ అభిమాని ‘కోహ్లీ… కోహ్లీ’ అంటూ అరుస్తున్న ఆడియోతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కోహ్లీ కోహ్లీ అని అరుస్తున్న సమయంలో గౌతమ్ అలా ఫింగర్ చూపించాడు అని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో గంభీర్ స్పందించారు. క్రౌడ్ లో కొందరు యాంటీ ఇండియా స్లోగన్స్ అరిచారు.
ఓ ఇండియన్గా దాన్ని నేను సహించలేను. నా దేశం గురించి ఎవ్వరూ ఇలా మాట్లాడినా నేను ఇలాగే స్పందిస్తాను. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అవాస్తవం. ఎవరి ఫ్యాన్స్కి నేను వ్యతిరేఖిని కాదు. కొందరు పాక్ ఫ్యాన్స్ ఇండియా గురించి, కశ్మీర్ గురించి తప్పుడు వాగుడు వాగుతున్నారు. అప్పుడు నా రియాక్షన్ అలాగే ఉంటుందని పేర్కొన్నాడు గంభీర్.
‘హిందూస్తాన్ ముర్తాబాద్’తో పాటు కశ్మీర్ గురించి మాట్లాడుతూ మన దేశాన్ని కించపరిచనప్పుడు ఇలా రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉండాలి. మ్యాచ్కు వచ్చిన అభిమానులు ఆటను చూడాలి తప్ప రాజకీయాలు మాట్లాడుతూ.. మరో దేశాన్ని కించపర్చేలా స్లోగన్స్ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్. కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియా వేదికగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను అనని వ్యాఖ్యలను కూడా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు అంటూ గంభీర్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు.