సకల సంపద..సర్వ భోగాలను వదిలి గుజరాత్కు చెందిన ప్రముఖ వ్యాపారి కుటుంబం సన్యాసం స్వీకరించడం విశేషం.
విధాత, హైదరాబాద్: సకల సంపద..సర్వ భోగాలను వదిలి గుజరాత్కు చెందిన ప్రముఖ వ్యాపారి కుటుంబం సన్యాసం స్వీకరించడం విశేషం. గుజరాత్ హిమ్మత్నగర్కు చెందిన ప్రముఖ కన్ స్ట్రక్షన్ వ్యాపారి వ్యాపారి భవేశ్ భాయ్ భండారి, ఆయన భార్య తమ రూ.200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. జైన సామాజికవర్గానికి చెందిన వీరు సన్యాస మార్గంలో వెళ్లేందుకు ‘దీక్ష’ను చేపట్టారు. ఇకపై కేవలం భిక్షాటన ద్వారా తమ రోజువారీ జీవనం కొనసాగించబోతున్నారు.
అంతకుముందే హిమ్మత్నగర్లో భండారీ దంపతులు నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించారు. అక్కడ వారు తమ ఆస్తులన్నింటినీ ఫోన్లతో సహా విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ 22న నది ఒడ్డున వారి సన్యాస స్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భండారి పిల్లలు ఇప్పటికే సన్యాసం దిశగా అడుగులేయటం ఆ దంపతుల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. తెలిసింది. భండారి కుమారుడు(19), కుమార్తె(16)లు 2022లో సన్యాసం స్వీకరించారు.
ఇప్పుడు తమ పిల్లల్లానే తాము కూడా సన్యాసం స్వీకరిస్తామని ఆ దంపతులు ప్రకటించారు. ఈ నెల 22న వారు సన్యాసం స్వీకరించి, ఆ తర్వాత చెప్పులు కూడా ధరించకుండా దేశాటన చేస్తూ భిక్ష తీసుకుంటూ జీవిస్తారు. ఆ సమయంలో కేవలం తెలుపు రంగు దుస్తులను మాత్రమే ధరిస్తారు. రెండు జతల తెలుపు రంగు దుస్తులు మాత్రమే వారి వద్ద ఉంటాయి. అన్ని కోట్ల రూపాయల సంపాదించిన ఆ కుటుంబం అన్నింటినీ వదిలేసి సన్యాసాన్ని స్వీకరించడం గుజరాత్ లో చర్చనీయాంశంగా మారింది. జైనమతం ప్రకారం, సన్యాసం స్వీకరించే వ్యక్తి భారతదేశం అంతటా చెప్పులు లేకుండా భిక్షతో జీవించాలి.
సన్యాసులు కేవలం రెండు తెల్లని వస్త్రాలు, భిక్ష కోసం ఒక గిన్నె మరియు “రజోహరన్”, ఒక తెల్ల చీపురు కలిగి ఉండటానికి అనుమతి ఉంది, జైన సన్యాసులు కూర్చునే ముందు కీటకాలను ఒక ప్రాంతం నుండి దూరంగా బ్రష్ చేయడానికి ఉపయోగిస్తారు, ఇది వారు అనుసరించే అహింస మార్గానికి చిహ్నం. అంతకుముందు భన్వర్ లాల్ జైన్ అనే బిలియనీర్ కూడా కోట్ల సంపదను దానంచేసి సన్యాసం తీసుకున్నారు. నిరుడు గుజరాత్లోనే ఓ డైమండ్ వ్యాపారి, ఆయన భార్య సన్యాసం పుచ్చుకున్నారు. అంతకుముందు అంటే 2017లోనే వారి కొడుకు సన్యాస దీక్ష తీసుకున్నాడు.