Kurnool | అట్టపెట్టెలతో ఇంట్లోనే.. భర్త మృతదేహానికి ద‌హ‌న సంస్కారాలు చేసిన భార్య‌

Kurnool | అనారోగ్యంతో మృతి చెందిన భ‌ర్తకు భార్య ఇంట్లోనే ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించింది. ఈ ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లా ప‌త్తికొండ ప‌ట్ట‌ణంలో సోమ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌త్తికొండ ప‌ట్ట‌ణానికి చెందిన పోతుగంటి హ‌రికృష్ణ ప్ర‌సాద్(60), ల‌లిత భార్యాభ‌ర్త‌లు. వీరికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దినేశ్ డాక్ట‌ర్ కాగా, క‌ర్నూల్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్నాడు. చిన్న కుమారుడు కెన‌డాలో స్థిర‌ప‌డ్డాడు. ఇక హ‌రికృష్ణ‌, ల‌లిత ప‌త్తికొండ‌లోనే ఉంటూ.. […]

  • Publish Date - May 29, 2023 / 01:39 PM IST

Kurnool | అనారోగ్యంతో మృతి చెందిన భ‌ర్తకు భార్య ఇంట్లోనే ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించింది. ఈ ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లా ప‌త్తికొండ ప‌ట్ట‌ణంలో సోమ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌త్తికొండ ప‌ట్ట‌ణానికి చెందిన పోతుగంటి హ‌రికృష్ణ ప్ర‌సాద్(60), ల‌లిత భార్యాభ‌ర్త‌లు. వీరికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దినేశ్ డాక్ట‌ర్ కాగా, క‌ర్నూల్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్నాడు. చిన్న కుమారుడు కెన‌డాలో స్థిర‌ప‌డ్డాడు. ఇక హ‌రికృష్ణ‌, ల‌లిత ప‌త్తికొండ‌లోనే ఉంటూ.. మెడిక‌ల్ షాపు నిర్వ‌హించుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు.

అయితే సోమ‌వారం తెల్ల‌వారుజామున హ‌రికృష్ణ ఇంట్లో నుంచి పొగ‌లు రావ‌డాన్ని స్థానికులు గ‌మ‌నించారు. దీంతో పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు హ‌రికృష్ణ మృత‌దేహాన్ని చూసి షాక‌య్యారు. దీంతో ల‌లిత‌ను విచారించ‌గా జ‌రిగిన విష‌యం చెప్పింది.

అనారోగ్యంతో త‌న భ‌ర్త సోమ‌వారం తెల్ల‌వారుజామున చ‌నిపోయాడు. కుమారులిద్ద‌రూ త‌మ‌ను స‌రిగా చూసుకోవ‌డం లేదు. కేవ‌లం ఆస్తి కోస‌మే త‌మ వ‌ద్ద‌కు వ‌స్తున్నారు. తండ్రి చ‌నిపోయిన విష‌యం తెలిస్తే కుమారులిద్ద‌రూ వ‌చ్చి ఆస్తి కోసం గొడ‌వ చేస్తార‌ని, ఆ భ‌యంతో తానే భ‌ర్త‌కు అట్ట‌పెట్ట‌లు పేర్చి నిప్పంటించాన‌ని ల‌లిత తెలిపింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Latest News