Indian Navy | ఇండియన్ నేవీ.. యాంటీ షిప్‌ మిసైల్స్‌ ప్రయోగం సక్సెస్!

  • By: sr    latest    Apr 27, 2025 2:25 PM IST
Indian Navy | ఇండియన్ నేవీ.. యాంటీ షిప్‌ మిసైల్స్‌ ప్రయోగం సక్సెస్!

Indian Navy |

విధాత: అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని భారత నౌకదళం విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా భారత నౌకాదళం ప్రకటించింది. పహల్గామ్ లో ఉగ్రదాడి కారణంగా భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత నౌకాదళం సన్నద్ధతను పరీక్షించుకునేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా.. ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్‌ నేవీ సిద్ధమని ప్రకటించింది. పహల్గామ్ దాడి తర్వాత ముంచుకు వచ్చే ఎలాంటి ముప్పు నుంచైనా దేశాన్ని రక్షించడానికి ఈ పరీక్షలు జరుగుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి.

మూడ్రోజుల క్రితమే భారత్‌ ఇదే సముద్రంలో మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (ఎంఆర్‌-ఎస్‌ఏఎం)తో సీ స్కిమ్మింగ్‌ పరీక్షను నిర్వహించింది. గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌లుగా పేర్కొంటారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ కొత్త క్షిపణిని పరీక్షించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.