20 రోజుల పసికందును చంపిన తల్లి

Maharashtra | నవ మాసాలు మోసి కని పెంచిన ఓ తల్లి తన బిడ్డ పట్ల కర్కశంగా ప్రవర్తించింది. అన్నెం పున్నెం ఎరుగని ఆ పసిపాపను గొంతు నులిమి చంపింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అకోలా జిల్లాలోని వాడి అదంపూర్ గ్రామానికి చెందిన 26 ఏండ్ల మహిళ.. 20 రోజుల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప అనారోగ్యానికి గురైంది. దీంతో మామ సహాయంతో […]

  • Publish Date - November 9, 2022 / 05:14 AM IST

Maharashtra | నవ మాసాలు మోసి కని పెంచిన ఓ తల్లి తన బిడ్డ పట్ల కర్కశంగా ప్రవర్తించింది. అన్నెం పున్నెం ఎరుగని ఆ పసిపాపను గొంతు నులిమి చంపింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. అకోలా జిల్లాలోని వాడి అదంపూర్ గ్రామానికి చెందిన 26 ఏండ్ల మహిళ.. 20 రోజుల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప అనారోగ్యానికి గురైంది. దీంతో మామ సహాయంతో పాపను తెల్హారా రూరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం అకోలా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

డాక్టర్ల సూచన మేరకు పాపను అక్కడికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పసికందును గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిడ్డను తానే చంపినట్లు తల్లి అంగీకరించింది. ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

Latest News