IRCTC Rules | భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తూ వస్తుంటుంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పలు నిబంధనలు రూపొందించింది. ఇందులో కొన్ని తప్పులు సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రైలు అటెండర్లు, టీటీఈ, క్యాటరింగ్ సిబ్బంది, రైళ్లలో పనిచేసే ఇతర రైల్వే ఉద్యోగులకు సైతం వర్తించనున్నాయి.
ధూమపానం, మద్యం సేవిస్తే జరిమానా విధించనున్నది. అదేవిధంగా ప్రయాణికులు పెద్దగా మ్యూజిక్ పెట్టకూడదు. తమ సీట్లు, కంపార్ట్మెంట్లు.. కోచ్లో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యేలా మాట్లాడకూడదు, శబ్దాలు చేయకూడదు. ఇక రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికులు లైట్లు వేయకూడదు.
రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికులను టికెట్లు చూపించమని టీటీఈ అడగకూడదు. గ్రూపులుగా ప్రయాణం చేస్తుంటే రాత్రి 10 గంటల తర్వాత బిగ్గరగా మాట్లాడకూడదు. మిడిల్ బెర్త్ ప్రయాణికులు తమ సీట్లు ఎప్పుడైనా తీసుకోవచ్చని, దీనికి సంబంధించి లోయర్ బెర్తులు ప్రయాణికులకు ఎలాంటి ఫిర్యాదు చేయొద్దని స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఆహారం అందుబాటులో ఉండదు.
అయితే, భోజనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవడానికి ఈ-కేటరింగ్ సేవలు పొందేలా అనుమతి ఉంటుందని తెలిపింది. ఏసీ కోచ్లో ప్రయాణించే వెళ్లే ప్రయాణికులు ఒక్కొక్కరు 70 కిలోల వరకు, స్లీపర్ క్లాస్లో 40 కిలోలు, సెకండ్ క్లాస్లో 35 కిలోల వరకు లగేజీ ఉచితమని, స్లీపర్లో 80 కిలోలు, సెకండ్ క్లాస్లో 70 కిలోలతోపాటు అదనపు బ్యాగేజీ చార్జీలతో 150 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చని ఐఆర్సీటీసీ వివరించింది.