విధాత: తెలంగాణ కోర్టులలో న్యాయశాఖ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సోమవారం నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. పరీక్ష అర్ధాంతరంగా నిలిచిపోవడం పట్ల సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ముందు అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. మూడు సెక్షన్లలో నిర్వహించ తలపెట్టిన పరీక్షలో ఉదయం రెండు సెషన్లు పూర్తికాగా మూడో సెషన్ మధ్యాహ్నం 4:45 నుండి 6:45 వరకు జరగాల్సి ఉంది. సర్వర్ డౌన్ కారణంగా మూడో సెషన్ పరీక్ష పేపర్ డౌన్లోడ్ కాలేదు. దీంతో […]
విధాత: తెలంగాణ కోర్టులలో న్యాయశాఖ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సోమవారం నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. పరీక్ష అర్ధాంతరంగా నిలిచిపోవడం పట్ల సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ముందు అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. మూడు సెక్షన్లలో నిర్వహించ తలపెట్టిన పరీక్షలో ఉదయం రెండు సెషన్లు పూర్తికాగా మూడో సెషన్ మధ్యాహ్నం 4:45 నుండి 6:45 వరకు జరగాల్సి ఉంది.
సర్వర్ డౌన్ కారణంగా మూడో సెషన్ పరీక్ష పేపర్ డౌన్లోడ్ కాలేదు. దీంతో సాయంత్రం 6 గంటల తర్వాత పరీక్ష వాయిదా వేస్తున్నట్లు త్వరలోనే పరీక్ష కొత్త తేదీలను వెబ్సైట్లో ప్రకటిస్తామంటూ నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష వాయిదా పై 150 మంది అభ్యర్థులు కళాశాల ముందు ఆందోళన నిర్వహించారు.
పోలీసులు అక్కడికి చేరుకొని అభ్యర్థులకు నచ్చజెప్ప ప్రయత్నించారు. వారు మొండికేయడంతో అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. పరీక్షల నిర్వహణలో తలెత్తిన సాంకేతిక లోపం పట్ల ఆగ్రహంతో అభ్యర్థులు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు సమస్యల పాలవుతున్న తీరు పట్ల వారు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.