Manda Krishna | ఎమ్మెల్సీ ఉండగా ఎమ్మెల్యేకు పోటీ స్టేషన్లో మాదిగలకే తాము మద్ధతిస్తాం లైంగిక ఆరోపణలున్న గండ్రకివ్వలేదా? అగ్రవర్ణాలకే అన్ని మంత్రి పదవులు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కడియంలో పదవీ కక్కుర్తి పెరిగిందని, తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఒక్క మాదిగనూ, మాదిగ ఉప కుల నాయకుడిని ఎదగనీయలేదని కడియం శ్రీహరి పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన […]
Manda Krishna |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కడియంలో పదవీ కక్కుర్తి పెరిగిందని, తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఒక్క మాదిగనూ, మాదిగ ఉప కుల నాయకుడిని ఎదగనీయలేదని కడియం శ్రీహరి పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన విమర్శలు చేశారు. ఎమ్మెల్యే తాటికొండ రాజన్న మీద కక్ష పెట్టుకుని ద్వేషంతో రాజకీయంగా ఆయను దెబ్బ కొట్టాలనే కుట్రలో ప్రధాన సూత్రధారి, పాత్రధారి కడియం శ్రీహరి అంటూ విమర్శించారు.
హనుమకొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ రాకపోవడం పైన కృష్ణ మాదిగ తీవ్రంగా ప్రతిస్పందించారు. రాజయ్యను రాజకీయంగా దెబ్బ తీసే విధంగా కడియం శ్రీహరి ఎదురు చూస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఏదో సాకుతో రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా పక్కన పెట్టారు. ఈ విషయంలో ఇప్పటికీ కెసీఆర్ సమాధానం చెప్పలేదు.
రాజయ్యను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే మేము తప్పు పట్టాము. రాజయ్యను బర్తరఫ్ చేస్తే ఉపముఖ్యమంత్రి పదవి శ్రీహరి తెచ్చుకున్నారు. కడియం అంటే, మాదిగ ఉప కులం నుంచి ఎదిగిన నేతగా గౌరవం ఉండేదనీ, కానీ రోజు రోజుకు ఆ గౌరవాన్ని తగ్గించుకునే పనులు ఆయనే కొని తెచ్చుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజయ్య పై దుష్ప్రచారం చేసావన్నారు. కడియం ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం పదవులపై ఆయనకు కక్కుర్తికి పెరిగిందానికి నిదర్శనమన్నారు.
అన్ని పదవులు అనుభవించారు
1983 నుండి రాజకీయాలలో ఉన్నావు..రాజకీయంగా అన్ని పదవులు పొందావనీ శ్రీహరినుద్దేశించి కృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మెల్సీ గా ఉన్న నీవు నీకు దగ్గరగా ఉన్న మాదిగ సామాజిక వర్గంలో ఎవరికైనా టికెట్ ఇప్పించాల్సి ఉండగా విస్మరించావన్నారు. రాజకీయంగా ఎవరిని సముచిత స్థానం కల్పించే దిశగా కడియం లేరని తేలిపోయిందన్నారు.
రానున్న ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ లో మాదిగ కులానికి సపోర్ట్ చేస్తామని స్పష్టం చేశారు. అక్కడ మాదిగలదే మెజారిటీ ఉందనే విషయం గుర్తు చేశారు. ఎమ్మెల్సీ గా కడియం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో కడియం గెలిచి పదవులు, అనుభావించినా పర్వాలేదు.మా నిర్ణయం మారాదని తేల్చిచెప్పారు.
గండ్రకు ఎందుకిచ్చారు?
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బెల్లంపల్లి ఎమ్మెల్యేలపై కొంతమంది లైంగిక ఆరోపణలు చేశారు. అయినా వారికి టికెట్ ఇచ్చారు. భూపాలపల్లి, ఎమ్మెల్యే పై లైంగిక వేధింపులు ఉన్నా బెల్లంపల్లి ఎమ్మెల్యే పై శేజల్ ఆరోపణలు రుజువులతో చెప్పినా వారికి టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. రాజయ్యకు ఎందుకు టికెట్ ఇవ్వలేదంటూ ప్రశ్నించారు.
అగ్ర వర్ణాలకే మంత్రి పదవులు
2003 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కమ్మ, రెడ్లు అధికారం చేస్తారని ముందే చెప్పానని కృష్ణమాదిగ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ మంది ఉన్న కమ్మ ,రెడ్లు, ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. ఎస్సీ ,ఎస్టీ ,బీసీలు ఎమ్మెల్యేలున్నా మంత్రులుగా అవకాశం లేకుండా ఉందన్నారు.
బీసీ మంత్రిగా ఉన్న ఈటల, ఆయన స్థానంలో బీసీని నియమించాలి, కానీ పట్నం మహేందర్ రెడ్డి కి అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఎస్సి, ఎస్టీ బిసిలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఉండాలన్నారు. ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేయాలన్నారు.
ఇండ్ల ముట్టడి చేయ్యద్దు
ఏ రాజకీయ పార్టీలైనా ఇళ్ల ముట్టడి చెయ్యద్దని కృష్ణ మాదిగ విన్నవించారు. నిన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇల్లు ముట్టడి చేశారని అన్నారు. ఆఫీస్ ల ముట్టడి చేపట్టాలన్నారు. సెప్టెంబర్ లో హైదరాబాద్ లో విశ్వరూప సభ పెట్టె విధంగా ఎమ్మార్పీఎస్ ప్లాన్ చేస్తున్నదని చెప్పారు. ఎస్సి రిజర్వేషన్లు పై రాజకీయ పార్టీ లు తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.