విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన బీఆరెస్. మెదక్ పార్లమెంట్ సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్ లతో పాటు ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మధన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే పార్టీ ముందుగా ఒంటేరు ప్రతాప్రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరగింది. దీంతో ఒంటేరుకు టికెట్ ఇస్తే తాము పదవులకు రాజీనామా చేస్తామని గజ్వేల్ నియోజక వర్గ నేతలు ఎలక్షన్ రెడ్డి తదితరులు వ్యతిరేకించినట్లు సమాచారం. అందుకే వెంకట్ రామ్ రెడ్డిని అధిష్టానం ప్రకటించిందని పార్టీ నేతలు అంటున్నారు.
మెదక్ బీఆరెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి
మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన బీఆరెస్. మెదక్ పార్లమెంట్ సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్
Latest News

ఎల్పీజీ కొరత ఎఫెక్ట్ ..ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి!
ఏఐ ఎఫెక్ట్.. మెటాలో 16వేల మంది ఉద్యోగాల తొలగింపు ?
ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు విస్తరించాలి: పొన్నం
కాంగ్రెస్ పార్టీకి త్వరలో జీవన్ రెడ్డి రాజీనామా?
హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ప్రారంభించారా..
హైదరాబాద్ 'రీజినల్ రింగ్ రైల్' కు కేంద్ర రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
జర్నలిస్టు సంక్షేమానికి స్టాలిన్ సర్కార్ కీలక ఆదేశాలు
కోకాపేటకు మించి హయత్ నగర్ వైపు అభివృద్ది : మంత్రి వెంకట్ రెడ్డి
ఏపీలో ఉద్యోగుల అల్టిమేటమ్!..తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ !!
కిమ్ మామ అలజడి: నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం