Rakhi | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ఇప్పటి వరకు మనం రాజకీయ నాయకులకు మాత్రమే క్షీరాభిషేకాలు చేయడం చూస్తున్నాం. నమ్ముకున్న నాయకుడు ఎనలేని సేవ చేసిన సందర్భంగా అతని మీద అభిమానంతో తమ అనుచరులు క్షీరాభిషేకాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ సోదరి తన సోదరుని ప్రేమాభిమానాలకు, కష్టసుఖాల్లో తోడున్న తన అన్నకు అభిమానంతో క్షీరాభిషేకం చేసి తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుంది. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతిక రాఖీ పౌర్ణమి. ఈ పండుగను పురస్కరించుకొని […]
Rakhi |
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ఇప్పటి వరకు మనం రాజకీయ నాయకులకు మాత్రమే క్షీరాభిషేకాలు చేయడం చూస్తున్నాం. నమ్ముకున్న నాయకుడు ఎనలేని సేవ చేసిన సందర్భంగా అతని మీద అభిమానంతో తమ అనుచరులు క్షీరాభిషేకాలు చేస్తుంటారు.
కానీ ఇక్కడ ఓ సోదరి తన సోదరుని ప్రేమాభిమానాలకు, కష్టసుఖాల్లో తోడున్న తన అన్నకు అభిమానంతో క్షీరాభిషేకం చేసి తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుంది. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతిక రాఖీ పౌర్ణమి. ఈ పండుగను పురస్కరించుకొని అన్నపై తనకున్న అభిమానాన్ని కొత్తగా చాటింది ఓ చెల్లి.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండల ఎంపీపీ భర్త, లోడేపల్లి సర్పంచ్ శ్రీనివాస్ కి రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లి తులసి రాఖీ కట్టి.. క్షీరాభిషేకం చేసింది.
ఆమె మాట్లాడుతూ తమ సోదరుడు శ్రీనివాస్ తన కష్టసుఖాల్లో అండగా ఉంటూ అన్నివేళలా తన ప్రేమను పంచుతూ ఆదుకుంటున్నాడని, అలాంటి అన్న మీద ప్రేమతో క్షీరాభిషేకం చేసి తన అభిమానాన్ని చాటుకున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా రాఖీ కట్టి, ఆనందంతో క్షీరాభిషేకం చేసింది.