Minister Errabelli రేవంత్, సంజయ్ లాంటి మూర్ఖులు, ఏవేవో మాట్లాడుతారు ఝూటా మాటలు నమ్మొద్దు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎవరెన్ని మాయోపాయాలు చేసినా, మాయమాటలు చెప్పినా వచ్చే ఎన్నికల్లో అధికారం మళ్ళీ బిఆర్ఎస్ కే! సర్వేలన్నీ బిఆర్ ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలోనూ నాదే గెలుపు. 80వేల మెజార్టీ గ్యారంటీ. అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. మంగళవారం తొర్రూరు […]
Minister Errabelli
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎవరెన్ని మాయోపాయాలు చేసినా, మాయమాటలు చెప్పినా వచ్చే ఎన్నికల్లో అధికారం మళ్ళీ బిఆర్ఎస్ కే! సర్వేలన్నీ బిఆర్ ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలోనూ నాదే గెలుపు. 80వేల మెజార్టీ గ్యారంటీ. అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. మంగళవారం తొర్రూరు బిఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి మూర్ఖులు, దుర్మార్గులు ఏవేవో మాట్లాడుతారు. ప్రతిపక్షాల ఝూటా మాటలు నమ్మొద్దు. కెసిఆర్ కు జనమంతా అండగా ఉండాలి. కాంగ్రెస్, బిజెపిల కుట్రలను తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రూ.500 లకు మించి ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారా? రూ.2వేలకు మించి రైతు బంధు తరహాలో పెట్టుబడి కి నిధులు ఇస్తున్నారా? ఆలోచించుకోవాలని ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని విధానాలు, తెలంగాణలో అమలు చేస్తామని ఎన్నికల కోసం, ఓట్ల కోసం కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మంత్రి మండి పడ్డారు.