బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ బీజేపీ.. దాని మిత్రపక్షాలను ఓడించండి

దేశంలో హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఫాసిస్టు విధానాలను అమలు చేస్తున్న బీజేపీ దాని , మిత్రపక్షాలను ఓడించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ వరంగల్ జిల్లా నాయకులు గంగుల దయాకర్ పిలుపునిచ్చారు.

  • Publish Date - April 22, 2024 / 01:03 PM IST

న్యూడెమోక్రసీ నాయకుడు గంగుల దయాకర్

విధాత, వరంగల్ ప్రతినిధి: దేశంలో హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఫాసిస్టు విధానాలను అమలు చేస్తున్న బీజేపీ దాని , మిత్రపక్షాలను ఓడించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ వరంగల్ జిల్లా నాయకులు గంగుల దయాకర్ పిలుపునిచ్చారు.

ఖిలా వరంగల్ పడమరకోట చమన్ సెంటర్లో సోమవారం సిపిఐ ఎంఎల్ పార్టీ 55వ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ ప్రధమ సోషలిస్టు రాజ్య నిర్మాత కామ్రేడ్ లెనిన్ 154వ జయంతి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు.

ముందుగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు జెండా ఎగురవేశారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి న్యూడెమోక్రసీ నాయకులు రాచర్ల బాలరాజు అధ్యక్షత వహించగా జిల్లా నాయకులు గంగుల దయాకర్ మరియు పిడిఎస్‌యు రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షులు తీగల జీవన్ మాట్లాడారు.

గత పది సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఫాసిస్టు విధానాలను అమలు చేస్తున్నదని వారన్నారు.రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేసి ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుని ప్రజాస్వామిక నియంతృత్వ విధానాలతో విప్లవకారులు మరియు ఇతర ప్రజాస్వామిక ,ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు అణచివేతలు కొనసాగిస్తుందని వారు విమర్శించారు.

మోడీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమ నాయకులకు ఇచ్చిన కనీస మద్దతు ధర హక్కు చట్టం రుణమాఫీ అక్రమ కేసులు ఎత్తివేత మొదలగు వాటిపై కప్పదాటు విధానాలను అనుసరించిందని వారు విమర్శించారు.బడా కార్పొరేట్ దోపిడీదారులకు సామ్రాజ్యవాదులకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరించి దోపిడి వర్గాల ఏజెంట్ గా మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని వారన్నారు రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాల కూటమిని ఓడించాలని ప్రజలను వారు కోరారు.

ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా నాయకులు గండ్రతి హరిబాబు ఇనుముల కృష్ణ వీరన్న గద్దల ప్రభాకర్ రాజు ఎండి అక్బర్ బండి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Latest News