Nizamabad సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ బోనాల రోజే ఊర పండుగ అంటూరోగాల నుంచి కాపాడు అమ్మోరు తల్లీ. సంవృద్దిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని పోచమ్మ తల్లిని నిజామాబాద్ నగరవాసులు ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. గ్రామదేవతలను ప్రత్యే కంగా పూజించి ఊరేగిస్తారు. విధాత, ప్రతినిధి నిజామాబాద్: ఆషాడమాసంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఊర పండగను ఆదివారం ఘనంగా నిర్వహిస్తారు. భాగ్యనగరంలో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల రోజే నిజామాబాద్ నగరంలో జరపడం ఆనవాయితీగా వస్తుంది. దీనికోసం అన్ని […]
Nizamabad
అంటూరోగాల నుంచి కాపాడు అమ్మోరు తల్లీ. సంవృద్దిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని పోచమ్మ తల్లిని నిజామాబాద్ నగరవాసులు ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. గ్రామదేవతలను ప్రత్యే కంగా పూజించి ఊరేగిస్తారు.
విధాత, ప్రతినిధి నిజామాబాద్: ఆషాడమాసంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఊర పండగను ఆదివారం ఘనంగా నిర్వహిస్తారు. భాగ్యనగరంలో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల రోజే నిజామాబాద్ నగరంలో జరపడం ఆనవాయితీగా వస్తుంది.
దీనికోసం అన్ని కుల సంఘాల సభ్యులు సర్వసమాజ్, పండగ కమిటీ ప్రతినిధులు ఇందులో భాగస్వాములవుతారు. గ్రామాదేవతల ప్రతిమాలను మామిడి కర్రపై కళకారులు చెక్కుతారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ఊరపండగకు ప్రత్యేక నేపథ్యం ఉంది.
వందల సంవత్సరాల క్రితం విషజ్వరాలతో వందల సంఖ్యలో జనాలు చనిపోయారు. పశువులు మృత్యువాత పడ్డాయి. నాటినుంచి అంటురోగాల నుంచి ఊరిని కాపాడాలని గ్రామ దేవతలను పూజించేందుకు ఊరపండగను ప్రారంభించారని చరిత్ర చెబుతుంది.
ఇందు కోసం జిల్లా కేంద్రంలో అన్ని కులాల పెద్దమనుషులు సర్వసమాజ్ గా ఏర్పడి నిష్టగా వేడుకలు నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన బందువులు, మిత్రులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
మండల వారం మూడు రోజుల ముందు బండారు పోస్తారు. బండారు పోసిన నాటినుండి పండగ జరిగే వరకు నగరవాసులు నగరాన్ని దాటి వెళ్లకూడదని నిబంధన విధిస్తారు. అలా వెళ్తే వెళ్లిన వారికి ఏదైనా కీడు జరుగుతుందని వారిని నమ్మకం. వారం రోజులపాటు గ్రామదేవత విగ్రహ ప్రతిమలను తయారుచేస్తారు. మామిడి చేట్టుకు పుజాలు చేసి మామిడి దుంగలను తీసుకు వస్తారు.
ఆ దుంగాలను ప్రత్యేకంగా నగరంలోని అశోక్ వీదిలోని వడ్లదాతిలో వడ్రాగీవారు దేవత మూర్తులను తయారు చేస్తారు. దేవత మూర్తులు సిద్దం అయ్యాక ఖిల్లా రఘునాధాలయం వద్ద ప్రత్యేకంగా గల తేలు మైసమ్మగద్దె నుంచి గ్రామదేవతల ఊరేగింపు ప్రారంభిస్తారు.
ఉదయం ప్రత్యేకంగా పూజలు చేసి మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య పోతురాజుల విన్యాసాల,
జోగినిల నృత్యాలు చేస్తూ అమ్మవార్లను ఊరేగిస్తారు. గాజులపేట చౌరస్తా వద్ద మొక్కులు తీర్చు కుంటారు. అక్కడి నుంచి పెద్దబజార్, కోటగల్లీ, జెండాగల్లీ, గోల్ హనుమాన్, పులాంగ్,వినాయక్ నగర్, మహాలక్ష్మీనగర్, మరోవైపు పెద్ద బజార్ నుంచి నెహ్రూపార్కు, పాతగంజ్, రైల్వేగేట్, గుర్బాబాది రోడ్, దుబ్బ వరకు గ్రామ దేవతలు ఊరేగించి వినాయక్ నగర్ లోని మహాలక్ష్మమ్మ గుడిలో కొన్నింటిని అలాగే దుబ్బా వద్ద గల పెద్దమ్మ ఆలయంలో మరికొన్నింటిని ప్రతిష్టిస్తారు.
గ్రామ దేవతల ప్రతిమలు తయారు చేసేందుకు.నగరంలోని ఆశోక్ వీధిలో గల వాడ్లదాతి వేదికను ప్రత్యేకంగా కేటా యించారు. వంశపారంపర్య కళాకారులు మోపాల్ లక్ష్మణ్, ధర్మరాజు, రవి రాజేందర్, శ్రీను, దేవేందర్, కిరణ్, శివ, శ్యాంసుందర్ తదితరులు మామిడి దుంగలతో గ్రామ దేవతల ప్రతిమలు తయారు చేస్తారు. పెద్దమ్మ, అడెల్లి పోచమ్మ, పగడాలమ్మ, సార్లమ్మలు, కొండలరాయుడు, భోగంసాన్ని, బదుచే తుల పోచమ్మ మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ, చాట్నం,పెద్దపులి ప్రతిమలు రూపొందిస్తారు.
ఇలా పది రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఇలా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొన్ని ఏళ్లుగా ఈ ఊర పండుగను అన్ని కులాల వాళ్ళు కలిసి మెలిసి ఎంతో వైభవంగా జరుపుకుంటారు.