Old Pension
- సీపీయస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
విదాత, హైదరాబాద్ ప్రతినిధి: జూలై 16 నుండి తెలంగాణ వ్యాప్తంగా పాత పెన్షన్ సాధన సంకల్పం రథయాత్రను చేపడుతున్నట్లు సీపీయస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, రాష్ట్ర శాఖ సభ్యుల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ కోశాధికారి నరేష్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ను అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 1,72,000 సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల కంట్రిబ్యూషన్ నిలుపుదల చేసి, సామాజిక భద్రత ఇచ్చే పాత పెన్షన్ ను అమలు చేయాలన్నారు.
పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులుగా ఉద్యోగ ఉపాధ్యాయుల కంట్రిబ్యూషన్ ఉంది కానీ ఉద్యోగికి ఆర్థిక భద్రత లేదన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ప్రభుత్వ గ్రాండ్ కలిపి 16 వేల కోట్లు ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడులుగా ఉంటాయని తెలిపారు. తక్షణమే సీపీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానంను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల గుండా ప్రతి సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయిని కలిసి పాత పెన్షన్ ఆవశ్యకతను తెలియజేస్తూ పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర నిర్వహిద్దామని ఏకగ్రీవంగా తీర్మానించారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ,ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్,కోశాధికారి నరేష్ గౌడ్ లు 33 జిల్లాల అధ్యక్ష ,కార్యదర్శులతో కలిసి పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర పోస్టర్, కర పత్రంను ఆవిష్కరించారు. ఈ సంకల్ప యాత్ర 2023 జులై 16 నుండి 2023 జులై 31 వరకు తెలంగాణ రాష్ట్రములోని 33 జిల్లాల గుండా అభీ నహీతో..కభీ నహీ అనే నినాదంతో సాగుతుందని తెలిపారు.
సీ.పీ.ఎస్ ఉద్యోగ , ఉపాధ్యాయుల పాతపెన్షన్ సాధన సంకల్ప రథయాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.