SAY NO TO CPS । ఉద్యోగుల‌కు భ‌ద్ర‌త‌లేని సీపీఎస్‌ను ర‌ద్దు చేయాలి: సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం డిమాండ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సీపీఎస్‌ రద్దవుతుందని ఉద్యోగులు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. పాత పెన్షన్ ప్రకటన కోసం రెండు లక్షల యాభై వేల ఉద్యోగుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయ‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీలైనంత త్వరగా సీపీఎస్‌ విధానం రద్దు చేసి, మరణించిన, పదవీ విరమణ పొందిన సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

SAY NO TO CPS । ఉద్యోగుల‌కు భ‌ద్ర‌త‌లేని సీపీఎస్‌ను ర‌ద్దు చేయాలి: సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం డిమాండ్‌

SAY NO TO CPS । రాష్ట్రంలో ఉద్యోగుల‌కు భద్రత లేని సీపీఎస్‌ విధానాన్ని విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్  డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే పాత పెన్ష‌న్ విధానాన్ని పున‌రుద్ధరించాలని కోరారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర  క‌మిటీ స‌మావేశం బుధ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో సీపీఎస్‌ నూతన కమిటీని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా కే రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడిగా లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ భాస్కర్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్భంగా లింగమొల్ల దర్శణ్ గౌడ్, విజయ్ భాస్కర్  మాట్లాడారు. రాష్ట్రంలోని  రెండు లక్షల యాభై వేలపైచిలుకు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్ష అయిన  సీపీఎస్‌ విధాన రద్దు, పాత పెన్షన్‌ విధాన పునరుద్ధరణకు కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తన మ్యానిఫెస్టోలో పెట్టడం హర్షణీయమని అన్నారు. మ‌న రాష్ట్రంలోనూ దశాబ్దకాలంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు చే‌స్తున్న పోరాటాన్ని గుర్తించి సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సీపీఎస్‌ రద్దవుతుందని ఉద్యోగులు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. పాత పెన్షన్ ప్రకటన కోసం రెండు లక్షల యాభై వేల ఉద్యోగుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయ‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీలైనంత త్వరగా సీపీఎస్‌ విధానం రద్దు చేసి, మరణించిన, పదవీ విరమణ పొందిన సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్, బదిలీలు చేపట్టి ఉద్యోగుల విశ్వాసం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అశాస్త్రీయమైన సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి వారి వృద్దాప్య జీవితానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కొత్త కమిటీ ఇదే

రాష్ట్ర అధ్యక్షులుగా లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఉప్పెరి విజయ్ భాస్కర్, కోశాధికారి గా మారం లింగారెడ్డి,ఉపాధ్యక్షులుగా లెక్కల వీరేశం,మంగ నర్సింహులు,భూలక్ష్మి, జాయింట్ సెక్రటరీగా నాగవెల్లి ఉపెందర్, అసోసియేట్ అధ్యక్షులుగా శిరందాసు రామదాసు, సందీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా  తిరుపతి,శోభన్, శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు