లేడీ పవర్‌స్టార్‌కు బంప‌రాఫ‌ర్.. రెండు భారీ ప్రాజెక్టులు?

SAI PALLAVI విధాత: ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాలెంటెడ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున సాయి పల్లవి పేరు చెబుతారు. ఆమె నటించిన చిత్రాలన్నీ ఆమెకు గుర్తింపును తెచ్చిన చిత్రాలే కావడం విశేషం. ఎలాంటి చిత్రాలంటే అలాంటివి ఒప్పుకోకుండా చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా, స్టార్ హీరో చిన్న హీరో అనే విభేదం చూపించకుండా తన పాత్రకు ప్రాధాన్యం, కథలో సత్తా ఉన్న చిత్రాలకు ఆమె ఓకే చెబుతుంది. దాంతో ఆమె చేసిన చిత్రాల […]

  • Publish Date - February 2, 2023 / 02:45 AM IST

SAI PALLAVI

విధాత: ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాలెంటెడ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున సాయి పల్లవి పేరు చెబుతారు. ఆమె నటించిన చిత్రాలన్నీ ఆమెకు గుర్తింపును తెచ్చిన చిత్రాలే కావడం విశేషం. ఎలాంటి చిత్రాలంటే అలాంటివి ఒప్పుకోకుండా చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా, స్టార్ హీరో చిన్న హీరో అనే విభేదం చూపించకుండా తన పాత్రకు ప్రాధాన్యం, కథలో సత్తా ఉన్న చిత్రాలకు ఆమె ఓకే చెబుతుంది. దాంతో ఆమె చేసిన చిత్రాల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది.

అయినా వాటితో ఆమెకు ఎక్కడ లేని క్రేజీ వచ్చింది. ఫిదా, లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్‌, మారి 2 సినిమాలలో ఆమె తన నటన సత్తా ఏమిటో నిరూపించింది. స్టార్ హీరోయిన్ అయినా కమర్షియల్ సినిమాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆమెను తీసుకోవడానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నా ఆమె మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఓకే చెబుతోంది.

అలాంటి క్వాలిటి ఉన్నందువలన ఈమె ప్రేక్షకుల మనసులో తక్కువ చిత్రాలతో ఎక్కువ గుర్తింపు పొందింది. రాశి కంటే వాసి ముఖ్య‌మ‌ని నిరూపిస్తోంది. క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా ప్రాజెక్ట్స్ లేవు. అయినా ఆమె తొందర పడటం లేదు. మనసుకు నచ్చే సినిమా వచ్చినప్పుడే చేద్దామనుకొని కథలు వింటోంది.

తాజాగా ఆమెకు కోలీవుడ్ నుంచి రెండు భారీ ఆఫర్స్ వచ్చాయని సమాచారం. తల అజిత్ హీరోగా నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కపోయే పాన్ ఇండియా మూవీలో ఓ కీలక పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు ఆమెను సంప్రదించారట.

ధనుష్ నటించబోయే 50వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించనుంది. పాన్ ఇండియా లెవెల్‌లో ఏకంగా 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో ధనుష్‌కు జోడిగా సాయి పల్లవిని ఎంచుకోవాలని భావిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మారి 2 బ్లాక్ బస్టర్ అయింది. దాంతో వీరి జోడి కి దేశవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. వీరు రౌడీ బేబీ సాంగ్‌తో బాగా పాపులర్ అయ్యారు. మరి ధనుష్ 50వ చిత్రానికి సాయి పల్లవి ఓకే చెబుతుందా లేదా అనేది తెలియాలంటే కాస్త వేచి చూడాలి..!

Latest News