Holidays | విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు భారీ వర్షాలపై మంత్రి తలసాని సమీక్ష విధాత: గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు మంగళ, బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటించారు. వర్షాలు తగ్గితే మళ్లీ సమీక్షించి సెలవులపై పునారాలోచన చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి ఈ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో కాలనీలు, రోడ్లన్నీ జలమయం […]
Holidays |
విధాత: గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు మంగళ, బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటించారు. వర్షాలు తగ్గితే మళ్లీ సమీక్షించి సెలవులపై పునారాలోచన చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు ప్రకటించారు.
అర్ధరాత్రి నుంచి ఈ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో కాలనీలు, రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికార యంత్రాంగంతో వరదలపై సమీక్ష నిర్వహించారు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, ఈవీడిఎం డైరెక్టర్, హైద్రాబాద్ కలెక్టర్ తో మంత్రి సమీక్షించారు. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్లు, కొమ్మలు కూలిన చోట నుండి వెంటనే తొలగించాలని సూచించారు.
హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు వరద ఉదృతి పెరగడంతో వాటి వాటర్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రవాహం పెరగడంతో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని, మూసీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు.