ఎన్నికల కమిటీ సభ్యులతో విడివిగా చర్చ అభిప్రాయాలు సేకరణ Congress | విధాత: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును తీవ్రతరం చేసింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం ఉదయం 11 గంటల నుంచి గాంధీ భవన్లో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులతో విడివిడిగా మాట్లాతున్నది. మధ్యాహ్నం 1 గంట వరకు 10 మంది సభ్యులతో విడివిడిగా చర్చించారు. మరో 13 మంది సభ్యులతో భోజన విరామం తరువాత సాయంత్రం […]
Congress | విధాత: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును తీవ్రతరం చేసింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం ఉదయం 11 గంటల నుంచి గాంధీ భవన్లో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులతో విడివిడిగా మాట్లాతున్నది. మధ్యాహ్నం 1 గంట వరకు 10 మంది సభ్యులతో విడివిడిగా చర్చించారు. మరో 13 మంది సభ్యులతో భోజన విరామం తరువాత సాయంత్రం 6 గంటల వరకు చర్చించనున్నారు.
మొత్తం 23 మంది ఎన్నికల కమిటీ సభ్యుల అభిప్రాయాలను స్క్రీనింగ్ కమిటీ తీసుకుంటుంది. మంగళవారం పార్టీ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో చర్చించనున్నారు. ఆతరువాత బుధవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానున్నది. హైదరాబాద్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం మొదలు కావడంతో ఆశావాహులంతా గాంధీ భవన్కు చేరుకొని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.