తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర చైర్ పర్సన్ శోభ Vemulawada | విధాత బ్యూరో, కరీంనగర్: మహిళలు బ్యాంకు రుణాల సద్వినియోగంతో ఆర్థికాభివృద్ధి సాధించి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర చైర్ పర్సన్ శోభ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం బ్యాంక్ ఆధ్వర్యంలో భారీ రుణమేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల రీజియన్ పరిధిలో 51 తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల పరిధిలో రూ.42 కోట్లు రుణాలు మంజూరు చేసి, పంపిణీ […]
Vemulawada | విధాత బ్యూరో, కరీంనగర్: మహిళలు బ్యాంకు రుణాల సద్వినియోగంతో ఆర్థికాభివృద్ధి సాధించి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర చైర్ పర్సన్ శోభ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం బ్యాంక్ ఆధ్వర్యంలో భారీ రుణమేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల రీజియన్ పరిధిలో 51 తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల పరిధిలో రూ.42 కోట్లు రుణాలు మంజూరు చేసి, పంపిణీ చేశారు.
అనంతరం శోభ మాట్లాడుతూ.. బ్యాంకు 350 గ్రూపుల సభ్యులకు ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఒకేరోజు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రూ. 20 లక్షల మేరకు తమ బ్యాంకులో రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని అన్నారు. రుణ మేళా పండుగ వాతావరణంలో జరిగింది. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్, వేములవాడ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ రావు, డీఆర్డీవో గౌతమ్ రెడ్డి, ఏఆర్ డీఓ రవికుమార్, డీపీఎం సుధారాణి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సరిత, తెలంగాణ గ్రామీణ బ్యాంకు జిల్లాలోని అన్ని శాఖల మేనేజర్లు, ఐకేపీ ఏపీయం, సీసీలు పాల్గొన్నారు.