తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. అయ్యప్ప దీక్షాపరులు శబరిమలకు వెళ్లేందుకు వీలుగా పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కిస్తున్నది.
విధాత: తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. అయ్యప్ప దీక్షాపరులు శబరిమలకు వెళ్లేందుకు వీలుగా పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కిస్తున్నది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 60కిపైగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. ఆయా రైళ్లు సికింద్రాబాద్, విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల మీదుగా నడువనున్నాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
సికింద్రాబాద్ – కొల్లం మధ్య డిసెంబర్ 10, 17, 24, 31న, జనవరి 9,14, తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే, నర్సాపూర్ – కొట్టాయం మధ్య డిసెంబర్ 10, 17, 24, 31, జవనరి 7, 14 తేదీల్లో రైళ్లు నడవనున్నాయి. తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి సికింద్రాబాద్కు డిసెంబర్ 12, 19, 26, జనవరి 9, 16న నడువనుండగా.. కొట్టాయం నుంచి నర్సాపూర్కు డిసెంబర్ 11, 18, 25, జనవరి 1, 8, 15 నడుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం రోడ్ – కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నవంబర్ 25, డిసెంబర్ 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20, 27 పరుగులు తీస్తాయని చెప్పింది.
విశాఖపట్నం – కొల్లం మధ్య నవంబర్ 29, డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో నడవనున్నాయి. కొల్లం – శ్రీకాకుళం రోడ్ మధ్య నవంబర్ 26, డిసెంబర్ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21, 28 నడువనున్నాయి. విశాఖపట్నం -కొల్లం మధ్య నవంబర్ 29, డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో నడవనున్నాయి. కొల్లం నుంచి విశాఖపట్నం మధ్య నవంబర్ 30, డిసెంబర్ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో ఆయా రైళ్లు నడువనున్నట్లు అధికారులు వివరించారు. ఆయా రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.