Special Trains | తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. స్కూళ్లకు సెలవులు సైతం దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వివిధ ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తుంటారు. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. షాలిమార్, సంత్రగాచి, కొల్లానికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Special Trains | తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. స్కూళ్లకు సెలవులు సైతం దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వివిధ ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తుంటారు. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. షాలిమార్, సంత్రగాచి, కొల్లానికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-సంత్రగాచి (07223) రైలు ప్రతి శుక్రవారం ఏప్రిల్ 17 నుంచి జూన్ 18 వరకు నడువనున్నది. సంత్రగాచి నుంచి సికింద్రాబాద్ (07224) రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం పరుగులు తీయనున్నది. ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్పుర్ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఇక సికింద్రాబాద్ – షాలిమార్ (07225) రైలు ఈ నెల 15 నుంచి జూన్ 24 వరకు సోమవారం అందుబాటులో ఉంటుంది. షాలిమార్-సికింద్రాబాద్ ( 07226) రైలు ఈ నెల 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం నడువనున్నది. ఈ రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, రాజమహేంద్రవరం, దువ్వాడ, భువనేశ్వర్, ఖరగ్పుర్, సంత్రగాచి మీదుగా వెళ్లనున్నది. సికింద్రాబాద్-కొల్లం (07193) రైలు ఈ నెల 17, 24, మే 1, 8, 15, 22, 29 జూన్ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. కొల్లం-సికింద్రాబాద్ (07194) రైలు ఈ నెల 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 నడువనున్నది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, రేణిగుంట, తమిళనాడులోని కాట్పాడి, ఈ-రోడ్, కోయంబత్తూరు, కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్ల ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.