పాల్గొన్న ప్రజాప్రతినిధులు,రాజకీయ ప్రముఖులు భద్రాద్రి తరహాలో వల్మీడి దేవాలయ అభివృద్ధి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఎర్రబెల్లి దంపతులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: శ్రీ రామ నవమి సందర్భంగా ఓరుగల్లు జిల్లాలోని పలు ఆలయాల్లో గురువారం సీతారామ కళ్యాణ ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. దంపతులుగా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, పచ్చ తోరణాలతో అలంకరించారు. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: శ్రీ రామ నవమి సందర్భంగా ఓరుగల్లు జిల్లాలోని పలు ఆలయాల్లో గురువారం సీతారామ కళ్యాణ ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. దంపతులుగా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, పచ్చ తోరణాలతో అలంకరించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు సుడిగాలి పర్యటన చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలను వారి సతీమణి ఉషా దయాకర్ రావుతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. భద్రాద్రి తరహాలో వల్మీడి దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. వల్మీడికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉందన్నారు. కార్యక్రమంలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దంపతులు, కలెక్టర్ శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.
మానుకోటలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
హనుమకొండ వేయి స్తంభాల గుడి ఎక్సైజ్ కాలనీలలో జరిగిన సీతారాముల కళ్యాణం ఉత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలోని నాచినపల్లి, కేశవాపురం గ్రామాలలో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో జరిగిన సీతారామ కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.
శ్రీ రామ నవమి పురస్కరించుకొని ములుగు పట్టణం, కాశిందేవిపేట, ఇంచెర్ల, వేంకటా పూర్, చల్వాయి, గోవిందరావుపేట గ్రామాల్లో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు.
శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో కళ్యాణార్థమై అంగరంగ వైభవోపేతంగా నిర్వచించారు.
ఈ మహోత్సవంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు.
రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామంలో సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి సతీసమేతంగా రాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హనుమకొండలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలలో కాంగ్రెస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.