Water | భూగర్భజలాలే దిక్కయ్యే దుస్థితి మితిమీరిన వాడకంతో క్షీణించే భూగర్భ జలాలు మోగుతున్న ప్రమాద ఘంటికలు న్యూఢిల్లీ: రాబోయే దశాబ్దంన్నర కాలంలో భూగర్భ వనరులు మటుమాయం అయ్యే విపత్తు పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యథేచ్ఛగా భూగర్భ జలాల తోడివేత దేశంలో ఉపరితల జలాలైన నదులు, చెరువులు, వాగులు ఎండిపోతున్న నేపథ్యంలో భూగర్భ జలాల వినియోగం యథేచ్ఛగా సాగుతున్నది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్ర సామగ్రితో భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి మరీ నీటిని […]
Water |
న్యూఢిల్లీ: రాబోయే దశాబ్దంన్నర కాలంలో భూగర్భ వనరులు మటుమాయం అయ్యే విపత్తు పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యథేచ్ఛగా భూగర్భ జలాల తోడివేత దేశంలో ఉపరితల జలాలైన నదులు, చెరువులు, వాగులు ఎండిపోతున్న నేపథ్యంలో భూగర్భ జలాల వినియోగం యథేచ్ఛగా సాగుతున్నది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్ర సామగ్రితో భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి మరీ నీటిని వెలికి తీస్తున్న పరిస్థితి ఉన్నది.
ఇది ఇలానే కొనసాగితే 2041-2080 భూగర్భ జలాలు మూడింతల వేగంతో ఖాళీ అయ్యే ప్రమాదం ఉన్నదని ఒక అధ్యయనంలో వెల్లడైంది. రాబోయే సంవత్సరాల్లో వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షాభావ పరిస్థితులను సృష్టిస్తాయని, ఫలితంగా భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన అగత్యం నెలకొంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది వినాశకర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
ప్రకృతిపై మానవుడి యుద్ధం
ప్రకృతి తన ధర్మాన్ని తాను నిర్వర్తించుకునేందుకు మానవ సమాజం సహకరించాలి. కానీ.. దాన్ని పట్టించుకోని సమాజం.. ప్రకృతిపై యుద్ధం ప్రకటిస్తున్నది. ప్రకృతి వనరులను పరిమితికి మించి వాడుతున్నది. ఈ క్రమంలోనే భూగర్భ జలాలపైనా ఆ ప్రభావం పడుతున్నది. ప్రత్యేకించి రెండు మూడు దశాబ్దాలుగా ఈ వనరుల దుర్వినియోగం మితిమీరిన స్థాయికి చేరుకున్నది.
చివరకు అది ప్రకృతి కూడా భరించలేని స్థితికి వెళుతున్నదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అవి మానవ వినాశనానికి దారి తీస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం మన ఎదుర్కొంటున్న అసాధారణ వాతావరణ మార్పులు, బలహీనమైన రుతుపవనాలు, కరువకాటకాలు, ఎల్నినో వంటి విపత్తులు వాటి ప్రభావమేనని గుర్తు చేస్తున్నారు.
రానున్న దశాబ్దాల్లో మూడింతల అధికంగా తోడివేత
ప్రస్తుతం భూగర్భ జలాలను తోడివేస్తున్న తీరు.. 2041-2080 నాటికి మూడు రెట్లు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వర్షాభావం వలన రైతులు భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సి వస్తుందని, దానితో కొద్దో గొప్పో మిగిలిన నీటి నిల్వలు కూడా ఖాళీ అవుతాయని సైన్సు అడ్వాన్సెస్ ఓపెన్ ఆక్సెస్ మల్టీ డిసిప్లీనరీ జర్నల్లో ప్రచురించిన శాస్త్రవేత్తల పరిశోధనా పత్రం పేర్కొంటున్నది. భవిష్యత్తులో 60 శాతం వ్యవసాయం భూగర్భ జలాలపైనే ఆధారపడుతుందని తెలిపింది. ఇటువంటి విషమ పరిస్థితిలో జరిగే వ్యవసాయం భవిష్యత్తులో విపరీత కరువు కాటకాలకు గురిచేస్తుందని హెచ్చరించింది.