విధాత: పెట్రోల్ అధిక ధరలకు కారణం ముడిచమురు కాదు.. మోడీనే అని.. చమురు ధరలతో మోడీ తన కార్పొరేట్ మిత్రులకు ఖజానా నింపుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చమురు ధరలపై ఆయన కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచింది.
పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజను దోచుకుంటున్నది. పెట్రోల్ ధరల పెంపును రాష్ట్రాలపై నెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. పెట్రోల్ ధరలపై పార్లమెంటులో చర్చ జరగకుండా కుట్రలు చేశారు. పెట్రో భారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమన్నారు.