సింగరేణి, అండర్ గ్రౌండ్ మైనింగ్లను ఆంధ్రా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ నాడు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఓపెన్ కాస్ట్ గనులు మూసివేస్తా అని.. నేడు సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలు విధాత: టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కూర్చి వేసుకొని ఓపెన్ కాస్ట్ గనులు మూసివేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. హాత్ సే హత్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో […]
విధాత: టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కూర్చి వేసుకొని ఓపెన్ కాస్ట్ గనులు మూసివేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. హాత్ సే హత్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నేడు 19వ రోజున మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం క్రాస్ రోడ్ వద్ద కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి ఓబి, అండర్ గ్రౌండ్ మైనింగ్ లను ఆంధ్రా బడా బాబుల కంపెనీలకు ధారాదత్తం చేస్తూ స్థానికుల ఉద్యోగాలను బిఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు నేడు 24 గంటల ఉచిత విద్యుత్తు అని, బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమి లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కొత్తగూడెం ఫేస్ వన్ నుంచి ఫేస్ 5 వరకు, భూపాలపల్లి, ఎన్ టి పి సి తదితర ప్రాజెక్టులు పూర్తయ్యాయి. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేకపోయిందని తెలిపారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టిన పవర్ ప్రాజెక్టు వల్లనే ఉత్పత్తి అవుతున్న కరెంటును తామిస్తున్నామని కెసిఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పడం విచారకరం అని పేర్కొన్నారు.