K. Vishwanath | సంగీతం, సాహిత్యం, కళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. 1980లో శంకరాభరణం చిత్రాన్ని కే విశ్వనాథ్ తెరకెక్కించారు. ఈ సినిమా అదే ఏడాది ఫిబ్రవరి 2న విడుదలైంది. ఈ చిత్రంతో విశ్వనాథ్ కళాతపస్విగా పేరొందారు. దేశ వ్యాప్తంగా శాస్త్రీయ సంగీత అభిమానుల ప్రశంసలు కూడా పొందింది ఈ మూవీ. సినీ ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించింది. ఆ సినిమా విడుదలైన రోజే కళాతపస్వి శివైక్యం పొందడం బాధాకరం. కే విశ్వనాథ్ తొలి సినిమాకు నంది.. […]
K. Vishwanath | సంగీతం, సాహిత్యం, కళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. 1980లో శంకరాభరణం చిత్రాన్ని కే విశ్వనాథ్ తెరకెక్కించారు. ఈ సినిమా అదే ఏడాది ఫిబ్రవరి 2న విడుదలైంది. ఈ చిత్రంతో విశ్వనాథ్ కళాతపస్విగా పేరొందారు.
దేశ వ్యాప్తంగా శాస్త్రీయ సంగీత అభిమానుల ప్రశంసలు కూడా పొందింది ఈ మూవీ. సినీ ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించింది. ఆ సినిమా విడుదలైన రోజే కళాతపస్వి శివైక్యం పొందడం బాధాకరం.
ఈ సినిమాకు కేవీ మహాదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది. అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం.
ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంశలను కూడా పొందింది. ఈ చిత్రం తర్వాత విశ్వనాథ్ కళా తపస్విగా పేరొందారు. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే ఈ సినిమా ప్రభావం ఏంటో మనకు తెలిసిపోతుంది.
ఈ చిత్రంలోని శంకరా.. నాదశరీరా పరా.. అనే పాట ఎంతో మంది మనసులను దోచుకుంది. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఈ పాటకు ప్రాణం ఉంటుంది. ఈ పాట తెలుగు ఖ్యాతిని కూడా పెంచింది. ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినా ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ లో శంకరాభరణంది ఎప్పటికీ చెక్కుచెదరని స్థానం.
శంకరా నాదశరీరాపరా పాటను వేటూరి సుందర రామమూర్తి రాశారు. ఈ పాటకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గీత రచయితగా వేటూరికి నంది అవార్డు వచ్చింది. ఈ పాటను ఆలపించింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
శంకరాభరణం ఉత్తమ సినిమాగా నంది అవార్డును సొంతం చేసుకోవడమే కాదు.. జాతీయ అవార్డు కూడా పొందింది. ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్’ విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది.
శంకరాభరణంలోని శంకరా.. నాదశరీరాపరా.. పాట మహాద్భుతం.. వీడియో
‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘స్వరాభిషేకం’ సినిమాలకూ నేషనల్ అవార్డులు వచ్చాయి. ‘స్వాతి ముత్యం’ సినిమాను ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 59వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా పంపించారు.