TRESA | వరద బాధితులకు అండగా రెవెన్యూ ఉద్యోగులు

TRESA విరాళంగా ఒక్క రోజు వేతనం విధాత: వరద బాధితులకు రెవెన్యూ ఉద్యోగులు అండగా నిలిచారు. వదర బాధితులకు సహాయ కార్యక్రమాల్లో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు, నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ఆగస్టు వేతనం నుండి ఒక రోజు వేతనాన్ని ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ మేరకు ఒక్క రోజు వేతనాన్ని సీఎంఆర్‌ఎఫ్‌కు ఇవ్వడానికి తమ అంగీకార పత్రాన్ని ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్‌ల నేతృత్వంలో రాష్ట్ర […]

  • Publish Date - July 31, 2023 / 01:12 PM IST

TRESA

  • విరాళంగా ఒక్క రోజు వేతనం

విధాత: వరద బాధితులకు రెవెన్యూ ఉద్యోగులు అండగా నిలిచారు. వదర బాధితులకు సహాయ కార్యక్రమాల్లో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు, నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ఆగస్టు వేతనం నుండి ఒక రోజు వేతనాన్ని ఇవ్వడానికి నిర్ణయించారు.

ఈ మేరకు ఒక్క రోజు వేతనాన్ని సీఎంఆర్‌ఎఫ్‌కు ఇవ్వడానికి తమ అంగీకార పత్రాన్ని ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్‌ల నేతృత్వంలో రాష్ట్ర కమిటి సభ్యులు సోమవారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు అందజేశారు. సీఎం కేసీఆర్‌ ద్వారా ఈ పత్రాన్ని ప్రభుత్వానికి అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షులు కె. నిరంజన్,రమేష్ పాక,కార్యదర్శి చిల్లా శ్రీనివాస్,జాయింట్ సెక్రటరీ నజీమ్ ఖాన్, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్షులు ఎల్లారెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కె. రామకృష్ణ, నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, నాయకులు సైదులు తదితరులు పాల్గొన్నారు.

Latest News